వ్యాపారాన్ని, రాజకీయాన్ని కలిపేస్తున్నారు. అందుకే నా వ్యాపారాన్ని హైదరాబాదులో చేద్దామని నిర్ణయానికి వచ్చాను. ప్రజాసేవ కోసం విశాఖలోనే రాజకీయాలు చేస్తాను. రాజకీయాల్లో ఉన్నందువల్ల ఎవరో ఒకరు.. ఏదో సమయంలో.. ఏదో ఒకటి అంటూనే ఉంటారని.. ప్రముఖ వార్తాపత్రిక ఈనాడుతో ఆయన అన్నట్టుగా కథనం. విశాఖ అభివృద్ధిలో ఎంవీబీ బిల్డర్స్ ముఖ్యపాత్ర పోషించింది.
అయినా అధికార పార్టీలో ఉండడం వల్ల అసత్య ప్రచారాలు ఎక్కువగా సాగుతున్నాయని.. తమ కస్టమర్లకు మంచి ఫ్లాట్లు, మంచి సర్వీసు ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. ‘డబ్బుల కోసం ఎవరో కిడ్నాప్ చేస్తే మాత్రం నేను భయపడి ఊరు వదిలి పారిపోతానా?.. నా వ్యాపారాన్ని రాజకీయాలకు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు. అందుకే.. ఈ తలనొప్పులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందనే వెళ్లాలనుకుంటున్నాను’ అని ఆయన చెప్పుకొచ్చారు.