మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైను ఎంతో అవసరం..
మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైను ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, ఈ లైను ఏర్పాటు చేస్తే దివిసీమ ప్రజల చిరికాల కోరిక తీరుతుందని ఎంపీ బాలశౌరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి వివరించారు. అదేవిధంగా ఇప్పుడున్న రైల్వే లైను ప్రకారం మచిలీపట్నం నుంచి వయా గుడివాడ, విజయవాడ, తెనాలి చేరుకోవాలంటే సుమారు 145 కిలోమీటర్లు ప్రయాణించాలన్నారు. అదే, మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైను ఏర్పాటు చేస్తే కేవలం 45 కిలోమీటర్ల దూరంలో తెనాలి చేరుకుని అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులువుగా ఉంటుందని ఎంపీ తెలిపారు.