ఆ ఒక్క నియోజకవర్గ యువతకే 10వేల ఉద్యోగాలు: మంత్రి మేకపాటి

First Published Dec 30, 2020, 4:19 PM IST

చిత్తశుద్ధి, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చన్న మాటకు నిదర్శనం సీఎం జగనేనని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. 

ఆత్మకూరు: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలపై పరిశ్రమలు,ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిహామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా నియోజవర్గంలోని నిరుద్యోగ యువతకు తీపికబురు అందించారు. ఒక్క ఆత్మకూరు నియోజవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకే 10వేల ఉద్యోగాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
undefined
సొంత నియోజకవర్గంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెట్ట ప్రాంత ప్రజలు వలస వెళ్లే అవసరం లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 169 లే-అవుట్లలోని 9522 గృహాలకు పట్టాల పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనే 1,050 ఇళ్లకు పట్టాలు అందించామన్నారు.
undefined
అర్హత ఉండి ఇళ్ల పట్టా అందని వారు ఒక్కరూ ఉండకూడదని గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని వీడియో ద్వారా ప్రదర్శింపజేసిన మంత్రి మేకపాటిమంత్రి ప్రసంగంలో భాగంగా సంక్షేమ పథకాల పేర్లు చదివి ప్రజలకు వినిపించారు. తాను చదివిన పథకాల పేర్లు 17 మాత్రమేనని..చదవని వాటి జాబితా చాంతాడంత ఉందన్నారు.
undefined
''చిత్తశుద్ధి, తపన ఉంటే ఏదైనా సాధించవచ్చన్న మాటకు నిదర్శనంసీఎం జగన్. ఆయన చేస్తున్న సంక్షేమం చూసి ఆర్థిక లోటు బదులు ఆర్థిక గనులేమన్నా ఉన్నాయా అనిపించింది.3 పద్ధతుల్లో ఇళ్ళను నిర్మిస్తూ..ప్రజలకు నచ్చిన విధంగా ప్రజలే మెచ్చిన తీరులో కట్టుకునేలా ప్రభుత్వం అండగా నిలిచింది'' అన్నారు.
undefined
''ఆత్మకూరు ప్రజలకు నేను చేయాల్సినదెంతో ఉంది.కుల,మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమం అందిస్తోన్న ముఖ్యమంత్రి వందేళ్లు క్షేమంగా ఉండాలి. రూ.853 కోట్లతో సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 ను, రూ.648 కోట్లతో ఫేజ్-2, రూ.632 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి సాగునీరు, తాగునీరుకు ఢోకా లేకుండా చేస్తాను.2 సార్లు ఎంఎల్ఏగా గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు న్యాయం చేయాలి నాయనా అని మా నాన్న, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి అనేకసార్లు నాకు చెప్పే మాట'' అని అన్నారు.
undefined
''మొదటి దశలో అనంతసాగరం మండలంలో 1793, అనుమసముద్రం పేట మండలంలో 1632 , ఆత్మకూరు గ్రామీణం పరిధిలో 864, పట్టణం పరిధిలో 1550, చేజర్ల మండలంలో 1135, మర్రిపాడులో 1296, సంగం మండలంలో 1252 ఇళ్ల పట్టాలు అందజేశాం. అదనంగా మరో 1,056 మంది టిడ్కో లబ్దిదారులకు ప్లాట్లు పంపిణీ చేశాం'' అని మంత్రి వెల్లడించారు.
undefined
ప్రజలకు ఇళ్ల పట్టాలు పంచిన అనంతరం మంత్రి పట్టణంలో కొత్తగా నిర్మించిన ఐసీడీఎస్ సీడీపీవో భవనాన్ని ప్రారంభించారు. అలాగేఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రూ.3.16కోట్లు వెచ్చించి నిర్మించనున్న మూడు భవన సముదాయాలకు మంత్రి శంఖుస్థాపన చేశారు.నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి కుళాయి తాగు నీరు అందించేలా రూ.17.41 కోట్లు ఖర్చుతో ఏర్పాటు చేయనున్న మంచినీటి పథకానికి కూడా శంకుస్థాపన చేశారు.
undefined
click me!