అన్నొస్తున్నాడు అన్నారు... వచ్చి ఏం పీకాడు: సీఎం జగన్ పై లోకేష్ ఫైర్

First Published Dec 29, 2020, 2:02 PM IST

19 నెలల పాలనలో 767 రైతుల్ని మింగి ఇప్పుడు రైతుకి ముందే సంక్రాంతి వచ్చింది అని దొంగ పేపర్ లో దొంగబ్బాయ్ ప్రకటన ఇచ్చారని.నారా లోకేష్ మండిపడ్డారు.

ప్రకాశం: రైతుల సమస్యల గురించి తెలుసుకునేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(మంగళవారం) ఆయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం మేడపి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోనిరైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యల గురించి తెలుసుకున్నారు నారా లోకేష్.
undefined
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ...అన్నొస్తున్నాడు అన్నారు...వచ్చాడు... వచ్చి ఏమి పీకాడంటూ విమర్శించారు.19 నెలల పాలనలో 767 రైతుల్ని మింగాడన్నారు.రైతుకి ముందే సంక్రాంతి వచ్చింది అనిదొంగ పేపర్ లో దొంగబ్బాయ్ ఈ రోజు ప్రకటన ఇచ్చారని... ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పండగ ముందే వచ్చింది అనడానికి జగన్ రెడ్డికి సిగ్గుందా? అని మండిపడ్డారు.
undefined
''50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 10 వేల కోట్లు నష్టం వస్తే 646 కోట్లు విదిల్చి పండగ వచ్చింది అంటున్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టపరిహార అంచనా కూడా అవసరం లేదు అన్న జగన్ రెడ్డి ఎకరానికి 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.ఇప్పుడు ఎకరానికి 5 వేలు పరిహారం ఇచ్చి రైతుల్ని అవమానపరుస్తున్నారు.నువ్విచిన 5 వేలకి పండగ చేసుకునే పరిస్థితి ఉందా?'' అని లోకేష్ నిలదీశారు.
undefined
''జగన్ రెడ్డి గాల్లో ఉంటాడు, వ్యవసాయ శాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్స్ లో బిజీగా ఉన్నాడు. రైతులను గాలికొదిలేసారు.జగన్ రెడ్డిది దరిద్ర పాదం. ఆయన వచ్చిన రోజు నుండి ఒక్క పండుగ లేదు. ఆయన లెగ్ ప్రభావంతో అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు.జగన్ రెడ్డి దరిద్ర పాదం వల్ల గత 30 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం రైతుకి జరిగింది.జగన్ రెడ్డి దరిద్ర పాదం రాష్ట్రంలో పెట్టిన తరువాత ఒక్క కరోనా తప్ప రాష్ట్రానికి వచ్చింది ఏమి లేదు'' అన్నారు లోకేష్.
undefined
''ఇన్సూరెన్సు కట్టాం అని అసెంబ్లీలో అబద్ధాలు ఆడాడుఫేక్ సీఎం.చంద్రబాబు అసెంబ్లీ లో బైటాయించిన తరువాత ఇన్స్యూరెన్సు కట్టారు. నేను ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే ముందు రోజు రాత్రి పరిహారం చెక్కు పంపించారు.దుర్గమ్మ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా టిడిపి హయాంలో ఇన్పుట్ సబ్సిడీ 3700 కోట్లు అందజేసాం అని.టిడిపి హయాంలో అసలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు అంటున్న వ్యవసాయ శాఖ మంత్రికి ప్రమాణం చేసే దమ్ముందా?'' అని లోకేష్ సవాల్ విసిరారు.
undefined
''టిడిపి హయాంలో తుఫాన్లు వస్తే యుద్ధ ప్రాతిపదికన రైతుల్ని ఆదుకున్నాం. మానవత్వం లేని జగన్ రెడ్డి రైతుల్ని ఆడుకోవడం లేదు.ఒక్క రైతు భరోసా మాత్రమే ఇస్తా అంటున్నాడు. అదైనా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాడా అంటే అదీ లేదు.చెప్పింది 12,500, మాట తప్పి,మడమ తిప్పి ఇస్తుంది 7,500 అంటే 5 వేలు మోసం. ఐదేళ్లలో 25 వేలు రైతుకి నష్టం'' అని వివరించారు.
undefined
''టిడిపి హయాంలో 50 వేలు రుణం ఉన్న ప్రతి రైతుకి ఒకే సంతకంతో రుణమాఫీ చేసారు చంద్రబాబు.లక్షా యాభైవేలు 5 విడతల్లో ఇస్తామంటే ఎద్దేవా చేసిన జగన్ రెడ్డి భరోసా పేరుతో ఇచ్చే 3 విడతల్లో ఇవ్వడమే రైతు దగా.15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కనీసం లక్ష మందికి కూడా రైతు భరోసా ఇవ్వడం లేదు. రైతుకి కులం అంటగట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి.అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీశాం,రైతులకు న్యాయం చెయ్యమని డిమాండ్ చేసాం అయినా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు అందుకే మళ్ళీ పోరాటం మొదలుపెట్టాం'' అన్నారు లోకేష్.
undefined
''తడిసి దెబ్బతిన్న, రంగుమారిన పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోళ్లు జరపాలి.ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలి.పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ కు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.50వేలు, దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు, చేతివృత్తుల వారికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. రైతులకు ఉరి వేసే మీటర్లు బిగించే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.
undefined
click me!