తిరుపతిపై బీజేపీ ఫోకస్: తెలంగాణ తరహా రిజల్ట్స్ కోసం కమలం వ్యూహాం

First Published Dec 29, 2020, 2:55 PM IST

తిరుపతి ఎంపీ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ స్థానంలో విజయం దక్కించుకోవడం కోసం ఆ పార్టీ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. 

తిరుపతి ఎంపీ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ స్థానంలో పోటీ చేసి విజయం సాధించేందుకు ఆ పార్టీ రంగం సిద్దం చేసుకొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది.
undefined
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బీజేపీ మెరుగైన విజయాలు సాధించింది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 కార్పోరేట్ స్థానాలను కైవసం చేసుకొంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు కూడ బీజేపీ కసరత్తు చేస్తోంది.
undefined
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సాధించిన విజయాలు బీజేపీ ఏపీకి చెందిన నేతల్లో కూడా విశ్వాసాన్ని నింపాయి. తెలంగాణ తరహా ఫలితాలు ఏపీ రాష్ట్రంలో సాధిస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యక్తం చేశారు.
undefined
తిరుపతి ఎంపీ స్థానం నుండి జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపుతామని బీజేపీ ప్రకటించింది. ఈ స్థానం నుండి పోటీకి దిగుతామని జనసేన కూడా ఆసక్తితో ఉంది. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్ధి బరిలోకి దింపుతారో ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై రెండు పార్టీలు కలిసి త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
undefined
దక్షిణ భారత దేశంలో విస్తరించాలనే ప్లాన్ పై బీజేపీ కేంద్రీకరించింది. ఇందులో భాగంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై బీజేపీ దృష్టి పెట్టింది.
undefined
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ ఫలితాలు బీజేపీ జాతీయ నాయకత్వంలో ఉత్సాహన్ని నింపాయి.తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.
undefined
తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో 45 బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై కేంద్రీకరించనుంది. తిరుమలను కాపాడాలంటే తిరుపతిలో బీజేపీ గెలవాలనే నినాదాన్ని కాషాయదళం ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయనుంది.1999, 2014 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుండి బీజేపీ విజయం సాధించింది. ఈ రెండు ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంది.
undefined
ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలోకి దిగనున్నారు. టీడీపీ తరపున ఆ పార్టీ వ్యూహాకర్త రాబిన్ శర్మ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ ప్రచారాన్ని నిర్వహించనుంది.
undefined
click me!