వాల్తేర్ వీరయ్య 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్ట్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని .. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలని మెగాస్టార్ పేర్కొన్నారు. అంతేకానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారా అంటూ చిరు ఆగ్రహం వ్యక్తం చేశారు.