విజయవాడ, గుంటూరు, కడియం, కాకినాడ, కడియం, ముమ్మిడివరం, ముక్కామల, యానాం వంటి ప్రాంతాల్లోనూ బిఆర్ఎస్ ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన భారీ ప్లెక్సీలను ఏపీ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతో ప్రజల్లో భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చ జరుగుతోంది.