రాయలసీమ ఉద్యమంపై ఆ ప్రాంతానికి చెందిన నేతలు కొంత కాలంగా కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. అయితే తాజాగా రాయల తెలంగాణ అంశాన్ని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెరమీదికి తీసుకువచ్చారు. ఈ విషయమై వేసవి తర్వాత కార్యాచరణను సిద్దం చేయనున్నట్టుగా జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.గ్రేటర్ రాయలసీమా, రాయల తెలంగాణలో దేనికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటే దానికే కట్టుబడి ఉంటామని గంగుల ప్రతాప్ రెడ్డి చెప్పారు.