మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా తిరుగులేని విజయం సాధించిన బాలశౌరి జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పుతూ అవసరమైన కోట్ల రూపాయల నిధులు సాధిస్తున్నారు. మచిలీపట్నం ఎంపీగా ఎన్నికైన 100 రోజుల్లోనే గుర్తుంచుకోదగ్గ అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు.
ఎన్నో ఏళ్లుగా బందరును పట్టిపీడిస్తున్న మురుగు సమస్యకు చెక్ పెడుతున్నారు. ఇందుకోసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంపై అధ్యయనానికి కేంద్ర నుంచి అధికారులను పిలిపించారు. కూటమి ప్రభుత్వం సహకారంతో ప్రత్యేక శ్రద్ద తీసుకుని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే, ఎంపీ బాలశౌరి అభ్యర్థన మేరకు మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ రైల్వే లైన్ నిర్మాణంపై ఉన్నతాధికారులు అధ్యయనం చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ లైన్ కూడా నిర్మిస్తే దివిసీమ ప్రజల చిరకాలకోరిక ''మచిలీపట్నం-రేపల్లే రైల్వే లైన్'' సాకారం అవుతుంది.