ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతోనే భారీగా దొంగ ఓట్లు నమోదు చేయిస్తుంది. దీనికి విశాఖపట్నం, గుంటూరులలో బయటపడ్డ ఉదంతాలే ఉదాహరణ. వైసిపి సానుభూతిపరుల ఇళ్లల్లో కొత్త ఓట్లను నమోదు చేయిస్తున్నారు. మరోవైపు టిడిపి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తీసేస్తున్నారు.