పవన్ కల్యాణ్ ఏపీకి మకాం షిఫ్ట్ ద్వారా హైదరాబాద్లో ఉంటున్నారని ఏపీ సీఎం జగన్ చేసే విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా అవుతుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఇక, ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్.. మూడో విడతకు సంబంధించిన షెడ్యూల్పై పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నారు.