అయితే, 2024 లోక్ సభ ఎన్నికల సమయానికి పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదు. ఇటీవల కొత్త పొత్తులు ఏర్పడి విచ్ఛిన్నం కావడంతో మారుతున్న రాజకీయ పరిస్థితులతో 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో కొత్త కూటములు వస్తాయని భావిస్తున్నారు. ప్రతిపక్షాల మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ లేకపోవడం గమనార్హం. అయితే, వైసీపీ పలు కీలక బిల్లులపై పార్లమెంటులో కేంద్రానికి మద్దతు పలికింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ మళ్లీ ఎన్డీయే గూటికి చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.