Lok Sabha polls: రానున్న లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలను ప్రారంభించాయి. ఇదే సమయంలో ఎన్నికల అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఎదురుదెబ్బ తగులుతుందని పేర్కొంది. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ కొన్ని సీట్లు లాస్ అవుతుందని తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ పైచేయి సాధిస్తుందని పేర్కొంది.