సోను సూద్ స్ఫూర్తి: రోడ్డేసుకున్నారు, ఇక డోలీలు ఉండవు

First Published Aug 27, 2020, 2:35 PM IST

ఎవరో వస్తారు, ఏమో చేస్తారు అని అనుకుంటూ కూర్చుంటే... పెద్దగా లాభం లేదు అని గ్రహించిన గ్రామస్థులు సోను సూద్ స్పూర్తితో సొంతంగా రోడ్డు నిర్మించుకున్నారు. వీరి పట్టదలను గురించి తెలుసుకున్న సోను సూద్ సంతోషించి వారిని ఆదర్శవంతులు అని కీర్తించడమే కాకుండా.... త్వరలో సందర్శిస్తానని కూడా మాటిచ్చాడు. 

ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గిరిజన గ్రామాల్లో సరైన వైద్యం అంధక చాలా మంది మరణిస్తున్నారు. దానికి ప్రధాన కారణం వారి గ్రామాలకు సరైన రహదారి లేకపోవడమే. కొండలు ఎక్కుతూ, వాగులు దాటుతూ ప్రతిరోజు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.
undefined
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని చింతమల, కొదమ గ్రామాలకు ఆసుపత్రిని చేరుకోవాలంనంటే సరైన మార్గం లేదు. గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే డోలీలో మోసుకెళ్లాల్సిందే. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు అని అనుకుంటూ కూర్చుంటే... పెద్దగా లాభం లేదు అని గ్రహించిన గ్రామస్థులు సోను సూద్ స్పూర్తితో సొంతంగా రోడ్డు నిర్మించుకున్నారు. వీరి పట్టదలను గురించి తెలుసుకున్న సోను సూద్ సంతోషించి వారిని ఆదర్శవంతులు అని కీర్తించడమే కాకుండా.... త్వరలో సందర్శిస్తానని కూడా మాటిచ్చాడు.
undefined
ఈ రెండు గ్రామాల్లో దాదాపుగా 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి ఆసుపత్రికి చేరుకోవాలంటే 12 కిలోమీటర్లు వెళ్ళాలి. గర్భిణులను తీసుకెళ్లాలంటే డోలీలో తీసుకెళ్లాల్సిందే. చాలా మంది ఇలా మార్గ మధ్యంలో ప్రాణాలను కూడా కోల్పోయారు.
undefined
ఇక ఎవరో వచ్చి ఏమో చేస్తారు అని కూర్చోవడం ఆపేసి వారే స్వయంగా రంగంలోకి దిగారు. తమకు సాధ్యమైనంత డబ్బును పోగేసి సొంతంగా ఘాట్ రోడ్డును నిర్మించుకున్నారు. వారు సోను సూద్ ను ఆదర్శంగా తీసుకొని ఈ పని పూర్తి చేసారు.
undefined
గ్రామాల్లోని ఒక్కో కుటుంబం నుండి 2000 రూపాయలను సేకరించారు. వీటితో పాటు మరికొంత అప్పుగా సేకరించి,మొత్తంగా 20 లక్షల రూపాయలను సమకూర్చుకున్నారు. పక్క రాష్ట్రం ఒడిశా నుండి జేసీబీలను తెప్పించుకొని 4 కిలోమీటర్ల ఘాట్ రోడ్డును పూర్తి చేసారు.
undefined
తమ అవసరాలను తీర్చడానికి పక్కవారు రావలిసింది అవసరం లేదని వారే స్వయంగా ఈ రోడ్డును పూర్తి చేసారు. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు వచ్చి ఏమో చేస్తాయి అని వారు పెట్టుకున్న ఆశలు ఆవిరయిపోవడంతో... వారే ఇలా స్వయంగా రంగంలోకి దిగి దీన్ని పూర్తి చేసారు.
undefined
ఈ గ్రామస్థుల పట్టుదలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తన స్పూర్తితో అని తెలుసుకున్న సోను సూద్ చాలా సంబరపడిపోయారు. దేశానికే మీరు మార్గదర్శకులు అని వారిని పొగుడుతూ... త్వరలోనే వచ్చి వారిని కలుస్తానని తెలిపాడు.
undefined
click me!