ఏసిబి కోర్ట్ వద్ద టెన్షన్ టెన్షన్... లాయర్లతో చంద్రబాబు, లోకేష్ మంతనాలు... అసలేం జరుగుతోంది?

Published : Sep 10, 2023, 11:09 AM ISTUpdated : Sep 10, 2023, 11:13 AM IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచారణ సందర్భంగా విజయవాడ ఏసిబి కోర్టువద్ద ఉద్రిక్తత నెలకొంది, 

PREV
14
ఏసిబి కోర్ట్ వద్ద టెన్షన్ టెన్షన్... లాయర్లతో చంద్రబాబు, లోకేష్ మంతనాలు... అసలేం జరుగుతోంది?
ACB Court

విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ లో ఏపీ రాజకీయాల్లో అలజడి రేగింది. టిడిపి అధికారంలో వుండగా స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ అవినీతి జరిగిందని... ఇందులో ప్రధాని నిందితుడు చంద్రబాబు నాయుడు అని ఆరోపిస్తూ సిఐడి అధికారులు అరెస్టు చేసారు. నంద్యాలలో మాజీ సీఎంను అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇవాళ (ఆదివారం) ఉదయం విజయవాడ ఏసిబి కోర్టుకు తరలించారు. 

24
ACB Court

చంద్రబాబు విచారణ సందర్భంగా కోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు ముగింపు దశకు చేరుకోడవడంతో న్యాయమూర్తి నిర్ణయం ఎలా వుంటుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. 

34
ACB Court

చంద్రబాబు విచారణ నేపథ్యలో ఆయన కుటుంబసభ్యులు కూడా కోర్టుకు వచ్చారు. నారా లోకేష్ తండ్రితో కేసు వాదిస్తున్న లాయర్లతో ఎప్పటికప్పుడు  సంప్రదింపులు జరుపుతున్నారు. ఎలాగయినా చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఆయన తరపు లాయర్లు ప్రయత్నిస్తుండగా సిఐడి మాత్రం జ్యుడిషియర్ రిమాండ్ కోరుతోంది. 

44
ACB Court

మరికొద్దిసేపట్లో వాదనలు ముగిసి కోర్టు తీర్పు వెలువడే అవకాశం వుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోర్టు ప్రాంగణంతో పాటు విజయవాడలో భారీగా పోలీసులను మొహరించారు.  ఏసీబీ కోర్టు ప్రాంగణంనుండి మీడియా సభ్యులు, పార్టీల నాయకులను పోలీసులు పంపిస్తున్నారు.  టిడిపి ముఖ్య నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. 


 

Read more Photos on
click me!

Recommended Stories