టెక్నాలజీతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతా: చంద్రబాబు

First Published Sep 7, 2023, 9:22 PM IST

సంపద సృష్టించి ప్రజలకు  పంచే బాధ్యతను తాను తీసుకుంటానని  టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారు. 
 

chandrababu

టెక్నాలజీ ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారు.  చేయి చేయి కలుపుదాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి  చేసుకుందామని ఆయన ప్రజలను కోరారు. సంపద సృష్టించి ప్రజలకు పంచే బాధ్యత తనదన్నారు. 

chandrababu naidu

‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ టీడీపీ  అధినేత నారా  చంద్రబాబు నాయుడు గురువారంనాడు  ప్రసంగించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుకు  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆప్యాయంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు దగ్గరకు తీసుకున్నారు. 

chandrababu

చంద్రబాబు మాట్లాడుతూ ఈ పోరాటం తన కోసం కాదని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమేనన్నారు. చేయి చేయి కలుపుదాం..రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.  ఒక్క ఛాన్స్‌ అని మోసపోయాం.. అరాచక పాలన పోవాలని చంద్రబాబు చెప్పారు. ఇచ్చేది పది రూపాయలు.. దోచేది వంద రూపాయలంటూ  ఆయన  జగన్ పాలనపై మండిపడ్డారు. 

chandrababu

ఇసుక ధరలపై ప్రశ్నిస్తే అరెస్టు చేసి జైలులో పెడుతున్నారు. ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించారని ఆయన విమర్శించారు.యువగళం.. ప్రజాగళం  ప్రజా ఉద్యమంగా మారిందని ఆయన చెప్పారు. యువగళం వాలంటీర్లపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. వ్యాపార కేంద్రమైన గుంతకల్లు పూర్వవైభవం కోల్పోయిందని చెప్పారు.గుత్తి చెరువుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.టీడీపీ  హయాంలో హంద్రీనీవా జలాలు తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మించి కియా పరిశ్రమ తెచ్చామన్నారు. కియా పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

chandrababu

 కాశేపల్లి టోల్ ప్లాజా వద్ద  చంద్రబాబునాయుడుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి ఘన  స్వాగతం పలికారు. ఆప్యాయంగా చంద్రబాబు జేసీ ప్రభాకర రెడ్డిని దగ్గరికి తీసుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన శాలువాను చంద్రబాబుకు  జేసీ ప్రభాకర రెడ్డి స్వాగతం పలికారు. బాబు ష్యురిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గుత్తి పట్టణానికి చేరుకున్నారు. చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. గుత్తి పట్టణానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

chandrababu

అనంతపురం ఇస్కాన్ ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతపురంలోని ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించారు. ఆలయవర్గాలు చంద్రబాబుకు స్వాగతం పలికాయి. కృష్ణాష్టమి నేపథ్యంలో ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి స్వయంగా వింజామర వీచారు. ఆలయ అర్చకులు చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాలను బహూకరించారు. అంతకుముందు ఆయన కల్యాణదుర్గంలో వ్యవసాయ సంక్షోభంపై నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక రాయలసీమను ఉద్యాన హబ్ గా మార్చుతామని తెలిపారు. గతంలో తాము రైతులకు పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకున్నామని, పంట బీమా తీసుకువచ్చామని, ఈ రెండు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు.

click me!