ఓవైపు క్రిస్మస్-మరోవైపు వైకుంఠ ఏకాదశి... ఓవైపు సంతోషం-మరోవైపు బాధ: సీఎం జగన్

First Published Dec 25, 2020, 1:32 PM IST

ఇళ్ల స్థలాల పంపిణీపై స్టే ఉన్న చోట్ల వాటి ఎత్తివేతకు సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

పులివెందుల:క్రిస్మస్‌ పండగ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. తల్లి విజయమ్మతో పాటు సీఎం జగన్ కుటుంబసభ్యులు, బంధువులు కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడమే కాదు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
undefined
క్రిస్మస్ వేడుకల అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ... ఇళ్ల స్థలాల పంపిణీపై స్టే ఉన్న చోట్ల వాటి ఎత్తివేతకు సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.స్టేలు ఎత్తివేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని... పైన దేవుడు ఉన్నాడని... మంచి పనికి తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడని అన్నారు.కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని నమ్ముతున్నామన్నారు.
undefined
''ప్రతి నిరుపేద కుటుంబానికి తప్పనిసరిగా ఇంటి స్థలం ఇస్తాం. అంతే కాకుండా ఇల్లు కూడా కట్టించి ఇస్తాం. ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గబోము. రాజీ పడబోము. ఇవాళ ఒక మంచి రోజు. ఒకవైపు క్రిస్మస్‌ పర్వదినం. మరోవైపు ముక్కోటి ఏకాదశి. ఎంతో పవిత్రమైన రోజు. అందుకే మహత్తరమైన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం పనులకు శ్రీకారం చుడుతున్నాం. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరోవైపు బాధ కూడా కలుగుతోంది'' అన్నారు.
undefined
''నిన్ననే పులివెందులలో ఎవరో కోర్టుకు వెళ్లి ఈ కార్యక్రమంపై స్టే తెచ్చారు. దీంతో ఇవాళ ఇక్కడ ఆ కార్యక్రమం జరగడం లేదు. ఏపీఐఐసికి చెందిన భూమి అంటూ కోర్టును ఆశ్రయించారు. ఏ భూమి అయినా ప్రభుత్వానిదే కదా?అక్కడ పేదలకు ఇళ్లు కటించి ఇస్తే, నిజంగా పరిశ్రమలకు కూడా ఉపయోగమే కదా?'' అని పేర్కొన్నారు.
undefined
''అయినా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోర్టుకు వెళ్లారు.అందుకే సుప్రీంకోర్టుకు అయినా వెళ్లి, అన్ని స్టేల ఎత్తివేతకు ప్రయతిస్తాం.ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఇల్లు కూడా కట్టించి ఇస్తాం'' అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
undefined
click me!