పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది.
ఈ టాస్క్ పోర్స్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు చైర్మన్గా ఉంటారు. టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కో- చైర్మన్గా టాస్క్ ఫోర్స్ ఉంటారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ స్టేట్ చేసే లక్ష్యంతో విజన్- 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇందులో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. అమరావతిలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది.