120కి పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటి మయం చేశాయని చెప్పారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారని వైకాపా పై విమర్శలు గుప్పించారు. "వ్యవస్థలను చెరబట్టారు. బాధితులనే నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. నియంత పోకడలతో, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ప్రభుత్వ టెర్రరిజానికి నాంది పలికారు. ప్రజల, ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో పెను ఉత్పాతం సృష్టించారని" ఫైర్ అయ్యారు.