ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. వారిలో ఆటో రిక్షా డ్రైవర్లు 2,25,621 మంది కాగా, మూడు చక్రాల ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలోనే అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం చేరనుంది.