తోట త్రిమూర్తులు నాకు శత్రువే: ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సంచలనం

First Published Sep 19, 2019, 9:17 AM IST

ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

: రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తనకు ఎప్పటికీ శత్రువేనని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వీరిద్దరి మధ్య దశాబ్దాల వైరం ఉంది. ఈ నెల 15వ తేదీన జగన్ సమక్షంలో తోట త్రిమూర్తులు వైఎస్ఆర్‌సీపీలో చేరారు.
undefined
తోట త్రిమూర్తులు వైఎస్ఆర్‌సీపీలో చేరడాన్ని దళితులు వ్యతిరేకిస్తున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో దళితులకు శిరోముండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో త్రిమూర్తులు టీడీపీలో ఉన్నాడు.
undefined
తోట త్రిమూర్తులు వైఎస్ఆర్‌సీపీలో చేరిన మరునాటి నుండే దళితులు ఆందోళనకు దిగారు.తోట త్రిమూర్తులును వైఎస్ఆర్‌సీలో చేర్చుకోవడంపై దళితులు మండిపడుతున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
undefined
బుధవారం నాడు ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కాన్వాయ్ ను దళితులు ద్రాక్షారామం వద్ద అడ్డుకొన్నారు. తోట త్రిమూర్తులును వైఎస్ఆర్‌సీలో చేర్చుకోవడంపై మండిపడ్డారు.శిరోముండనం బాధితులకు తాను అండగా ఉంటానని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు.
undefined
దళితులను శాంతింపజేసేందుకు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రయత్నించారు.పార్టీలోకి వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. తోట త్రిమూర్తులు నిన్న, ఈరోజు, రేపు... నాకు శత్రువే.
undefined
ఆయనను పార్టీలో చేర్చుకొనే ముందు రోజు సాయంత్రమే నాకు పార్టీ నుండి సమాచారం వచ్చిందని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. శిరోముండనం బాధితులకు తాను అండగా ఉంటానని ఆయన ప్రకటించారు.
undefined
శిరో ముండనం కేసులో దళిత సంఘాలు చలో విజయవాడకు సిద్దమౌతున్నాయి. శిరో ముండనం కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. బాధితులకు తాను అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. కోర్టుకు రావడానికైనా ధర్నాకు కూర్చోనేందుకైనా తాను సిద్దమేనని ఆయన ప్రకటించారు.
undefined
బాధితులను తాను సీఎం జగన్ వద్దకు కూడ తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తోట త్రిమూర్తులుకు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది.
undefined
పిల్లి సుభాష్ చంద్రబోస్ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన జగన్ స్థాపించిన వైఎస్ఆర్‌సీపీలో చేరారు తోట త్రిమూర్తులు తొలుత టీడీపీలలో ఆ తర్వాత పీఆర్‌పీ, కాంగ్రెస్ ,టీడీపీల నుండి ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలో చేరారు.
undefined
ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.
undefined
click me!