ఉపాధి హామీ పథకంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కార్యక్రమాన్ని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యవసాయ మంత్రి తెలిపారు. ఈ పథకంలో భాగంగా చిన్న మరియు సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులు పశుగ్రాసం పెంచడానికి అర్హులని తెలిపారు. తమ భూమిలో కనీసం 25 సెంట్ల నుండి 2.5 ఎకరాల వరకు పశుగ్రాసంను పెంచవచ్చని తెలిపారు. నిర్ణీత పొలంలో దుక్కిదున్నడం, విత్తనాలు వేయడం,నీటి సరఫరా మరియు ఎరువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం ప్రభుత్వమమే అందిస్తుందని అన్నారు.