మహేశ్‌, జూ.ఎన్టీఆర్‌, బన్నీ వంటివారయితే... :సమంత

By Prashanth MFirst Published Jul 5, 2019, 8:39 AM IST
Highlights

సమంత, సీనియర్‌ నటి లక్ష్మి , రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ నటించిన చిత్రం 'ఓ బేబీ'.  ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.... ఓ రేంజిలో గత కొద్ది రోజులుగా సమంత ప్రమోట్ చేస్తోంది. తన సొంత ప్రొడక్షన్ లో సినిమా కన్నా ఎక్కువగా శ్రద్ద చూపిస్తోంది. అందుకు కారణం ఆమె మీడియాతో చెప్పింది. 
 

సమంత, సీనియర్‌ నటి లక్ష్మి , రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ నటించిన చిత్రం 'ఓ బేబీ'.  ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.... ఓ రేంజిలో గత కొద్ది రోజులుగా సమంత ప్రమోట్ చేస్తోంది. తన సొంత ప్రొడక్షన్ లో సినిమా కన్నా ఎక్కువగా శ్రద్ద చూపిస్తోంది. అందుకు కారణం ఆమె మీడియాతో చెప్పింది. 

సమంత ''మహేశ్‌, జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ వంటివారయితే థియేటర్లకు ఆటోమేటిగ్గా జనాలు వచ్చేస్తారు. అమ్మాయి స్టార్‌ హీరోయిన్‌ అయినా థియేటర్లకు జనాలను రప్పించడం మామూలు విషయం కాదు. అందుకే నా వంతు నేను విపరీతంగా ప్ర్రమోషన్‌ చేస్తున్నా. ఒక్కసారి థియేటర్‌కు వచ్చిన వారికి మాత్రం తప్పకుండా ఇది నచ్చే సినిమా అవుతుంది. ఎందుకంటే టీజర్‌, ట్రైలర్‌ ఇప్పటికే అందరికీ నచ్చింది. మంచి సినిమా తీశానని నాకూ తెలుసు'' అని చెప్పుకొచ్చింది సమంత .

అలాగే ...మామూలుగా రీమేక్‌లు చేయడం వేరు. ఈ సినిమాను రీమేక్‌ చేయడం వేరు. ఈ చిత్రానికి అఫిషియల్‌గా ఇది ఏడో రీమేక్‌. అందుకే చాలా జాగ్రత్తగా చేశాం. ఏదో రైట్స్‌ తీసుకుని, మనకు తగ్గట్టు మార్చి చేసుకున్నాం అనే భావనతో కాకుండా, ఒరిజినల్‌ వాళ్లను పెట్టుకుని ప్రతి సన్నివేశమూ ఎందుకు పెట్టారో తెలుసుకుని ప్రాపర్‌గా రీమేక్‌ చేశాం. తెలుగు సినిమాకు కూడా ఒరిజినల్‌ వాళ్లు నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్నారు అన్నారామె.

దేవి థియేటర్‌ ముందు మీకు పెద్ద కటౌట్‌ పెట్టారనే విషయం గురించి మాట్లాడుతూ...కటౌట్లది ఏముంది? కలెక్షన్లు రావాలి. యు టర్న్‌ సినిమా చాలా బావుందని చెప్పారు. కానీ కలెక్షన్లు అనుకున్నంత రాలేదు. ఈ సినిమాకు మాత్రం కలెక్షన్లు రావాలి. వస్తాయనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది సమంత.

click me!