SAMANTHA: 'డెడ్ ' అని పోస్ట్ ఎందుకు పెట్టినట్లు?ఎందుకు డిలీట్ చేసింది?

By Surya PrakashFirst Published May 25, 2022, 4:14 PM IST
Highlights

ట్రైలర్ చూసిన సమంత ప్రభు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో డెడ్ అని రాసి ఈమోజీలతో థోర్ సినిమా పోస్టర్ షేర్ చేసింది. డెడ్ అని పెట్టడంతో కాస్సేపటికే వైరల్ కాసాగింది. అయితే మరి కాస్సేపటికి ఆ పోస్ట్ కన్పించలేదు. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో సమంత ఒకరు. ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోలందరి సరనస నటించింది. సినిమాలతో పాటుగా సోషల్‌‌మీడియాలో కుడా చాలా యాక్టివ్ గానే ఉంటుంది సమంత. తన అన్నీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ లలో Samantharuthuprabhu అనే తన పూర్తి పేరుతో  ఖాతాలను ఓపెన్ చేసింది.  చాలా యాక్టివ్. విభిన్నమైన పోస్టులు, కొటేషన్లతో అభిమానుల్ని ఆకట్టుకుంటుంటుంది. తాజాగా డెడ్ అంటూ పోస్ట్ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే పెట్టిన కాస్సేపటికే డిలేట్ చేసింది. ఎందుకలా చేసిందో ఎవరికీ అర్దం కాలేదు.
 
వివరాల్లోకి వెళితే...మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి థోర్ సిరీస్ నాలుగవ మూవీ థోర్..లవ్ అండ్ థండర్ సినిమా త్వరలో విడుదల కానుంది. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూసిన సమంత ప్రభు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో డెడ్ అని రాసి ఈమోజీలతో థోర్ సినిమా పోస్టర్ షేర్ చేసింది. డెడ్ అని పెట్టడంతో కాస్సేపటికే వైరల్ కాసాగింది. అయితే మరి కాస్సేపటికి ఆ పోస్ట్ కన్పించలేదు. 

ఆ పోస్ట్ ప్లేస్ లో..థోర్ సినిమాలో సూపర్ విలన్ బాలే లుక్ షేర్ చేస్తూ ది గాడ్ ఆఫ్ యాక్టింగ్ అని రాసింది. క్రిస్టియన్ బాలే ది డార్క్ నైట్, ది డార్క్ నైట్ రైజెస్ సినిమాల్లో బ్యాట్‌మ్యాన్‌గా అదరగొట్టాడు. ప్రస్తుతం విలన్‌గా చేస్తున్నాడు. డెడ్ అనే పోస్ట్ సమంత ఎందుకు డిలీట్ చేసిందనేది తెలియలేదు. అసలు డెడ్ అని ఎందుకు పెట్టిందనేది చర్చనీయాంశమైంది. అయితే ఆమెకు ఆ ట్రైలర్ నచ్చలేదని, అందుకే డెడ్ అని పెట్టిందని, కానీ అనూహ్యంగా వైరల్ అవటం...ఓ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసినట్లు అవుతుందనిపించటంతో ఆమె డిలేట్ చేసిందని అంటున్నారు.

 హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో కేక పెట్టిస్తున్నారు. అంతేకాదు వరుస చిత్రాలతో బిజీగా ఉంటూనే... మరో పక్క సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. . ఆమె నటించిన తాజా సినిమా కన్మణీ రాంబో ఖతీజా తాజాగా విడుదలై ఓకే అనిపించుకుంది. మరోవైపు తాజాగా ఆమె నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి.
 

click me!