Prabhas:'ప్రాజెక్ట్ K'మ్యాటర్ పై మామా,అల్లుళ్ల మాటలివే !

By Surya PrakashFirst Published Jan 12, 2022, 12:50 PM IST
Highlights

 'ప్రాజెక్టు K' సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ ను ఇప్పటికే పూర్తిచేశాడు.ఇందులో ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 


ఒక పక్క పాత సినిమాల్ని పూర్తి చేస్తూ... మరోపక్క కొత్త చిత్రాల కోసం రంగంలోకి దిగుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. ‘ఆదిపురుష్‌’ని పూర్తి చేసిన ఆయన ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణ కోసం సెట్స్‌పైకి అడుగుపెట్టారు. మరోపక్క ‘రాధేశ్యామ్‌’ విడుదలకి ముస్తాబై వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌  హీరోగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్ విషయాలపై క్లారిటీ ఇచ్చారు అశ్వనీదత్. అలాగే రిలీజ్ డేట్ ని సైతం దాదాపు ఫిక్సైనట్లే చెప్పుకొచ్చారు. 

సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. కథ రీత్యా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించేలా తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ చేసారు.   'ప్రాజెక్టు K' సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ ను ఇప్పటికే పూర్తిచేశాడు.ఇందులో ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే  ఆయపై ఇదివరకే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ‘మహానటి’ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన ప్రాజెక్ట్ కే గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు. ప్రాజెక్ట్ కే కు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. పరిస్థితులు సహకరిస్తే నెలాఖర్లో కొత్త షెడ్యూల్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ షెడ్యూల్ లో అమితాబ్, దీపికా పదుకొనే పాల్గోనే అవకాశం ఉంది. అన్ని సవ్యంగా సాగితే వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఈ సినిమా షూటింగు .. విడుదల మరింత ఆలస్యం కానున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వనీదత్ స్పందిస్తూ .. "ఈ సినిమా షూటింగు మరింత ఆలస్యం కానుందనే ప్రచారంలో నిజం లేదు. పరిస్థితులు చూసుకుని ఈ నెల చివరిలో మళ్లీ మొదలుపెట్టాలనుకుంటున్నాము. సినిమా షూటింగ్ ప్రారంభమయినా కూడా.. దీనికి చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరమని, ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులు చూడని సినిమా అవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అయితే అన్ని పనులు పూర్తి చేసుకుని 2023 ఏప్రిల్ లేదా మేలో ప్రాజెక్ట్ కె ప్రేక్షకుల ముందుకు రానుందని అశ్విని దత్ స్పష్టం చేశారు.
 

click me!