పిజ్జా- 2 డెలివరీకి రెడీ

Published : Sep 01, 2017, 05:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పిజ్జా- 2 డెలివరీకి రెడీ

సారాంశం

పిజ్జా చిత్రానికి సీక్వెల్ రెడీ అయ్యింది. విజయ్‌సేతుపతి, గాయత్రి హీరో హీరోయిన్ లుగా నటించారు. ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించబడిందీ చిత్రం.

పిజ్జా సినిమా తమిళంలో ఎంత హిట్ అయ్యిందో తెలుగులోనూ అంతే హిట్ టాక్ తెచ్చకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రెడీ అయ్యింది. డీవీ సినీ క్రియేషన్స్ పతాకం పై నిర్మాత డి.వెంకటేష్ పిజ్జా-2 చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళ సినీ రంగంలో వరస హిట్లతో దూసుకుపోతున్న హీరో విజయ్‌సేతుపతి, గాయత్రి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రంజిత్ జయకోడి. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా వుంది.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ..తమిళ్ లో విజయ్ సేతుపతి నటించిన  'పురియత్ పుధీర్' చిత్రాన్ని పిజ్జా-2 గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించబడిందీ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దాడు. సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం..అని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది