
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన చిత్రం ఏస్. ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన రెండు నెలలోపే విజయ్ సేతుపతి మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ సేతుపతి,, నిత్యామీనన్ జంటగా నటించిన తలైవన్ తలైవి(సర్ మేడం) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్ కాలేదు. అయితే తమిళ వెర్షన్ కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
'తలైవన్ తలైవి' జూలై 25న విడుదలై మంచి స్పందన పొందుతోంది. పాండిరాజ్ దర్శకత్వంలో సత్య జ్యోతి ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం, గ్రామీణ నేపథ్యంలో వివాహ, కుటుంబ జీవితంలోని సరదాలు, భావోద్వేగాలతో చూపిస్తుంది.
'ఏస్' సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో, విజయ్ సేతుపతి అభిమానులు మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. 'తలైవన్ తలైవి' ఆ అంచనాలను అందుకునేలా కనిపిస్తోంది. మదురై పరోటా మాస్టర్ గా ఆయన నటన అద్భుతం. నిత్య మీనన్ కూడా భార్యగా చక్కగా నటించింది. ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకులు అంటున్నారు.
ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సుకుమార్ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణన్ సంగీతం ఆకట్టుకున్నాయి. మైనా నందిని, దీప, రోషిణి హరిప్రియన్, యోగి బాబు వంటి నటీనటులు కూడా ఉన్నారు.
బుకింగ్స్ చాలా చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి.