ఈడీ ముందుకు విజయ్‌ దేవరకొండ.. `లైగర్‌` పెట్టుబడులపై విచారణ..

Published : Nov 30, 2022, 12:32 PM IST
ఈడీ ముందుకు విజయ్‌ దేవరకొండ.. `లైగర్‌` పెట్టుబడులపై విచారణ..

సారాంశం

విజయ్‌ దేవరకొండ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. `లైగర్‌` సినిమా పెట్టుబడులకు సంబంధించిన ఈడీ బుధవారం విజయ్‌ దేవరకొండని విచారిస్తుంది. 

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌)(ED) ముందుకు హాజరయ్యారు. ఆయన బుధవారం ఈడీ అధికారుల విచారణలో పాల్గొనబోతున్నారు. `లైగర్‌`(Liger) చిత్రంలో పెట్టుబడులకు సంబంధించి విజయ్‌ దేవరకొండని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాసేపటి క్రితమే విజయ్‌ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఈడీ విచారణ ఎదుర్కొనబోతున్నారు. 

`లైగర్‌` సినిమా పెట్టుబడులు, ఆయన రెమ్యూనరేషన్‌, సినిమాకి ఎవరెవరు పెట్టుబడి పెట్టారనే దానిపై విచారించేందుకు ఈడీ అధికారులు విజయ్‌కి నోటీసులు జారి చేయగా, బుధవారం ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్‌ దేవరకొండని సైతం విచారించడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

`లైగర్‌` చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. వంద కోట్లకుపైగానే బడ్జెట్‌ అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలై పరాజయం చెందింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఆ నష్టాల వ్యవహారానికి సంబంధించిన లావాదేవీలను సైతం ఈడీ విచారిస్తుంది. ఇదిలా ఉంటే విదేశాల నుంచి ఈ సినిమాకి పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించిందని సమాచారం. అంతేకాదు పలువురు పొలిటికల్‌ లీడర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారట. దానిపై ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ విచారించబోతుంది. 

విజయ్‌ దేవరకొండని ఈడీ ప్రశ్నించడమనే వార్త ఇప్పుడు అటు ఫిల్మ్ నగర్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఇందులో విజయ్‌ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన `లైగర్‌`లో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించగా, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేసింది. వరల్డ్ మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైఖేల్‌ టైసన్‌ ఇందులో కీలక పాత్రలో నటించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 25న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ `ఖుషీ` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?