భారత సైన్యం కోసం అండగా విజయ్‌ దేవరకొండ, అల్లు అరవింద్‌.. వ్యాపారంలో, సినిమా కలెక్షన్లలో వాటా

Aithagoni RajuPublished : May 9, 2025 6:42 PM

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయ్‌ దేవరకండ, `సింగిల్‌` మూవీతో పాజిటివ్‌ రెస్పాన్స్ ని అందుకుంటున్న నిర్మాత అల్లు అరవింద్‌ భారత సైన్యం కోసం తమవంతు సహకారాన్ని అందించబోతున్నట్టు ప్రకటించారు.  

ఉగ్రవాదానికి కేరాఫ్‌గా నిలిచిన పాకిస్తాన్‌పై భారత్‌ యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అమాయక ప్రజలను టార్గెట్‌ చేస్తూ పాక్‌ దాడులకు దిగుతున్న నేపథ్యంలో భారత సైన్యం దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇండియాని దొంగ దెబ్బ కొట్టేందుకు పాక్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్‌ ఎదుర్కొని ధీటుగా సమాధానం చెబుతుంది. అంతేకాదు పాకిస్తాన్‌ని గట్టి దెబ్బకొడుతుంది. అక్కడి ప్రధాన నగరాలను టార్గెట్‌ చేసి భారత్‌ సైతం దాడులు నిర్వహిస్తుంది. దీంతో భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం నెలకొంది. 

సైన్యం కోసం తెలుగు సెలబ్రిటీలు

ఈ క్రమంలో భారత ప్రభుత్వానికి, సైన్యానికి ప్రజలు సపోర్ట్ ని ప్రకటిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వాలు, ప్రతిపక్షాలు సైతం పూర్తి మద్దతుని ప్రకటించారు. ప్రభుత్వానికి సైన్యానికి స్వేచ్చనిచ్చాయి. ఈ క్రమంలో యుద్ధం అంటే భారీగా నష్టం కూడా ఉంటుంది. సైన్యానికి అన్ని రకాలుగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మన తెలుగు స్టార్స్ సైన్యం కోసం తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు. 

రౌడీ వేర్స్  లాభాల్లో వాటా ప్రకటించిన విజయ్‌ దేవరకొండ

నేడు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్న విజయ్‌ దేవరకొండ భారత సైన్యం కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తాను రౌడీ వేర్స్ పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన లాభాల్లో కొంత వాటాని సైన్యానికి అందించబోతున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశం పాకిస్తాన్ కు సరైన గుణపాఠం నేర్పేందుకు మన భారత సైన్యం ముందడుగు వేస్తోంది. ఇలాంటి సమయంలో తన బాధ్యతగా ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించారు హీరో విజయ్ దేవరకొండ. 

రాబోయో కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాను భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అంటూ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా  షేర్ చేశారు విజయ్ దేవరకొండ. దీంతో అభిమానులను ఆయన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

`సింగిల్‌` మూవీ కలెక్షన్లలో వాటా ప్రకటించిన అల్లు అరవింద్‌

మరోవైపు అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ కూడా తన వంతు సహకారాన్ని ప్రకటించారు. ఆయన సమర్పణలో వచ్చిన `సింగిల్‌` మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిశోర్‌ వంటి వారు నటించిన ఈ మూవీకి పాజిటివ్‌ రియాక్షన్‌ వస్తుంది. దీంతో తాజాగా థ్యాంక్స్ మీట్‌ నిర్వహించి సైన్యానికి జేజేలు పలికారు. ప్రభుత్వానికి, సైన్యానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఈ క్రమంలో `సింగిల్‌` మూవీకి సంబంధించి వచ్చే కలెక్షన్లలో కొంత వాటాని సైన్యానికి విరాళంగా అందిస్తామని తెలిపారు అల్లు అరవింద్‌. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!