దేవరకొండ ‘మీకు మాత్రమే చెప్తా’..రిలీడ్ డేట్ ఖరారు !

By Prashanth MFirst Published Sep 24, 2019, 8:18 AM IST
Highlights

మీకు మాత్రమే చెప్తా’టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే కుర్రాళ్లకు ఎక్కేసింది. దాంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నామంటూ విజయ్ దేవరకొండను ట్యాగ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.

పెళ్లిచూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోను చేస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే కుర్రాళ్లకు ఎక్కేసింది. దాంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నామంటూ విజయ్ దేవరకొండను ట్యాగ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.

‘‘మీకు మాత్రమే చెప్తా’’ అనే క్యాచీ టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ టీజర్‌తోనే ప్రామిసింగ్ మూవీ అనిపించుకుంది. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి ఎంటర్‌టైనర్‌ అని అర్దమవుతోంది. ఇక థియేటర్‌లో పూర్తిగా నవ్వులు పంచేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది. షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని   దీపావళికు ఓ వారం ముందు అక్టోబర్ 18న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. అప్పటికి విజయ్ దేవరకొండ తాజా చిత్రంవరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ సైతం పూర్తి కానుంది. ఈ రిలీజ్ డేట్ ని కలిపి ట్రైలర్ ని సైతం వదలటానికి సన్నాహాలు చేస్తున్నారు.

కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్.టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ మూవీ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది.\

తరుణ్ భాస్కర్‌తో పాటు అనసూయ భరద్వాజ్ మరో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తుండటం విశేషం.‘మీకు మాత్రమే చెప్తా’లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తుంటే.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

click me!