‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ లు పడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ దర్శకుడు బాలా డైరక్షన్ లో షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధం అయ్యాక.. ఔట్ పుట్ బాగా లేదని దాన్ని పూర్తిగా స్క్రాప్ క్రింద తీసేయటం.. హీరో తప్ప మొత్తం టీంను మార్చేసి కొత్తగా సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించడం జరిగింది.
'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ లు పడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ దర్శకుడు బాలా డైరక్షన్ లో షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధం అయ్యాక.. ఔట్ పుట్ బాగా లేదని దాన్ని పూర్తిగా స్క్రాప్ క్రింద తీసేయటం.. హీరో తప్ప మొత్తం టీంను మార్చేసి కొత్తగా సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించడం జరిగింది.
అంతేకాదు దీనిపై అధికారిక ప్రకటన చేయడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. బాలా కూడా ఈ విషయాన్ని పెద్దది చేయటానికి ఇష్టపడలేదు. కాబట్టి సమస్యా ఏమీ రాలేదు. కొత్త డైరక్టర్ పనులు మొదలెట్టేసారు.
ఇక కొత్త టైటిల్తో ఈ చిత్రం ఫస్ట్లుక్ని చిత్ర నిర్మాతలు ఈ4 ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసారు. ఈ సినిమాను ‘అదిత్య వర్మ’ అనే టైటిల్తో ధృవ్ ఉన్న ఫస్ట్లుక్ని విడుదల చేశారు. గిరీశయ్యా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బనితా సందు హీరోయిన్గా, ప్రియా ఆనంద్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు.
రవి.కె.చంద్రన్ ఈ చిత్రానికి డీ.ఓ.పీగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు మరో అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అదేమిటంటే...తెలుగు అర్జున్ రెడ్డిలో నటించిన విజయ్ దేవరకొండను ఈ సినిమాలో గెస్ట్ రోల్ కు అడుగుతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా గురించిన అన్ని విషయాలు ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ... ఈ ప్రాజెక్టుకు క్రేజ్ రావటం కోసం తన దైన సాయిం చేస్తానని మాట ఇచ్చారని తెలుస్తోంది.