ఆ ఛాన్స్ వస్తుందనుకోలేదు.. అదే నా మొదటి సంపాదనః విద్యాబాలన్‌

By Aithagoni RajuFirst Published Jun 17, 2021, 8:27 PM IST
Highlights

తనకు తొలి అవకాశం వస్తుందని ఊహించలేదని, నమ్మకం లేకుండానే షూట్‌కి వెళ్లానని చెప్పింది విద్యాలన్‌. ఈ సందర్భంగా తాను తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంతో వెల్లడించి షాక్‌ ఇచ్చింది. 

తనకు తొలి అవకాశం వస్తుందని ఊహించలేదని, నమ్మకం లేకుండానే షూట్‌కి వెళ్లానని చెప్పింది విద్యాలన్‌. ఈ సందర్భంగా తాను తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంతో వెల్లడించి షాక్‌ ఇచ్చింది. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న విద్యా బాలన్‌ ప్రస్తుతం `షేర్నీ` చిత్రంలో నటించింది. ఈ సినిమా రేపు(జూన్‌ 18న) విడుదల కాబోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన విద్యా బాలన్‌ ఒక్కో సినిమాకి కోట్లల్లో పారితోషికం అందుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను అందుకున్న తొలి పారితోషికం రూ. ఐదు వందలని వెల్లడించింది. ఓ టూరిస్ట్ క్యాంపెయిన్‌ కోసం ఫోటో షూట్‌లో పాల్గొన్నదట. తన స్నేహితులు, కజిన్స్‌తో కలిసి ఆ టూరిస్టు క్యాంపైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నట్టు చెప్పింది. 

ఈ ఫొటోషూట్‌లో వీరంతా ఓ చెట్టు పక్కన నిలుచుని చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజ్‌ ఇవ్వాలి. అలా ఫొటోలకు ఫోజులిచ్చినందుకు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చారట. అదే తన తొలి సంపాదన అని చెప్పింది విద్యా బాలన్‌.  విద్యాబాలన్‌ `హమ్‌ పాంచ్‌` సీరియల్‌తో నటిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సీరియల్ ఆడిషన్స్ కోసం తన తల్లి, సోదరితో కలిసి ఫిల్మ్ సిటీకి వెళ్లిందట. రోజంతా అక్కడే ఉన్నారట. దాదాపు అక్కడికి 150 మంది వరకు ఆడిషన్స్ కు వచ్చారని, వారందరిని చూసి తనకు అవకాశం రాదనుకున్నానని, కానీ చివరకి అందులో నటించే ఛాన్స్ వచ్చినట్లుగా చెప్పుకోచ్చింది విద్యాబాలన్.

click me!