ఈమధ్య సినిమా స్టార్స్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను గట్టిగా వాడేస్తున్నారు. ట్రాఫిక్ తట్టుకోలేక కొందరు.. సినిమా ప్రమోషన్ల కోసం మరికొందరు.. ఇలా ఎక్కువగా స్టార్స్ మెట్రోను ఆశ్రయిస్తున్నారు. తాజాగాస్టార్ హీరో మెట్రో ఎక్కి ఏం చేశాడంటే..?
ఈమధ్య స్టార్స్ అంటా తమ లగ్జరీ వెహికిల్స్ వదిలేసి.. పబ్లిక్ ట్రాన్స పోర్ట్ పైన పడ్డారు. ఇటీవలే కొందరు స్టార్ సెలబ్రిటీలు ప్రజా రవాణాను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ అయితే.. ఎక్కువగా మెట్రోలోనే ప్రయానిస్తున్నారు. ఈమధ్యనే హేమా మాలినితో పాటు.. ఈమధ్య హృతిక్ రోషన్ కూడా ముంబయ్ మెట్రోలో ప్రయాణించిన విషయం తెలిసిందే..? ఇక తాజాగా మరో బాలీవుడ్ స్టార్ కూడా మెట్రోలో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు.
రజినీకాంత్ - కమల్ హాసన్ సంచలన నిర్ణయం, హీరో సిద్దార్ధ్ వల్ల బయటకు వచ్చిన నిజం..
రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలను తప్పించుకునేందుకు మెట్రో అనువైన మార్గం కావడంతో చాలా మంది తారలు మెట్రోను అనుసరిస్తున్నారు. సినిమా ప్రొమోషన్స్, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం వంటి వాటికోసం దీన్ని ఆశ్రయిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ఢిల్లీ మెట్రో లో ప్రయాణించి ప్రయాణికులకు షాక్ ఇచ్చాడు. అయితే ఆయన మెట్రోలో ప్రాయాణించింది మాత్రం ట్రాఫిక్ కష్టాలకువిసిగిపోయి మాత్రం కాదు.. ఆయన తన తాజా సినిమా ప్రమోషన్ కోసం మెట్రో ఎక్కాడు.
జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ - ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?
విక్కీ కౌశల్ హీరోగా..యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా రూపొందిన సినిమా బ్యాడ్న్యూస్. ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ అవ్వబోతోంది. ఈసందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్లకు పదును పెట్టారు. ఈక్రమంలోనే బ్యాడ్ న్యూస్ ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు టీమ్. ఇందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీలో ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు విక్కీ. అభిమానులతో మీట్-అండ్- గ్రీట్ వంటి సెషన్స్ ను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే సహ నటులు త్రిప్తి డిమ్రీ, అమ్మీ విర్క్తో కలిసి ఢిల్లీ మెట్రో రైలులో జర్నీ చేశారు. ట్రైన్ లో ప్రయాణం చేస్తూ.. అందులోని ప్రయాణికులతో సరదాగా మాట్లాడుతూ.. తమ సినిమా ప్రమోషన్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. విక్కీ కౌశల్, యానిమల్ ఫేం తృప్తి డిమ్రి కాంబోలో వస్తున్న బ్యాడ్ న్యూస్ మూవీని ఆనంద్ తివారి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అమ్మి విర్క్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ ఈసినిమాను నిర్మించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (పోస్ట్ థ్రియాట్రికల్) స్ట్రీమింగ్ కానుంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ వెంకటేష్ సినిమా ఏదో తెలుసా..?