సమంత `సామ్జామ్` పేరుతో ఓ రియాలిటీ షోకి హోస్ట్ చేస్తుంది. నాగార్జున `బిగ్బాస్` చేస్తున్నాడు. నాని, చిరంజీవి, ఎన్టీఆర్, రానా వంటి వారు రియాలిటీ షోస్కి హోస్ట్ గా చేశారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా హోస్ట్ గా మారబోతున్నారు.
కరోనా, లాక్డౌన్..డిజిటల్ మాధ్యమాలకు ప్రయారిటీ పెంచింది. డిజిటల్ కంటెంట్కి ప్రాధాన్యత పెరిగింది. స్టార్స్ సైతం డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మరోవైపు తారలు హోస్ట్ లుగా మారిపోతున్నారు. సమంత `సామ్జామ్` పేరుతో ఓ రియాలిటీ షోకి హోస్ట్ చేస్తుంది. నాగార్జున `బిగ్బాస్` చేస్తున్నాడు. నాని, చిరంజీవి, ఎన్టీఆర్, రానా వంటి వారు రియాలిటీ షోస్కి హోస్ట్ గా చేశారు.
ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా హోస్ట్ గా మారబోతున్నారు. తన అబ్బాయి రానాతో కలిసి ఓ రియాలిటీ షో చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీరి కాంబినేషన్లో ఓ రియాలిటీ షో చేయడానికి ప్రముఖ టీవీ ఛానెల్ ప్లాన్ చేసిందట. ఇప్పటికే రానా హోస్ట్ చేసిన `నెంబర్ వన్ యారీ` షోలో వెంకటేష్ కనిపించి సందడి చేశారు. అయితే ఈ సారి వీరిద్దరు కలిసి రియాలిటీ షో చేయబోతున్నారట. గతంలో కంటే భిన్నంగా ఈ షోని డిజైన్ చేశారట. సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఫస్ట్ టైమ్ వెంకీ చేయబోతున్న ఈ షో ఎలా ఉంటుందనేది ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఓ తమిళ రీమేక్లో వీరిద్దరు హీరోలుగా నటిస్తారని, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతోపాటు ఇటీవల రానా `సౌత్బే` పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించారు. ఇందులో నిర్వహించే లవ్ ప్రోగ్రామ్కి వెంకీ హాజరయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పాల్గొన్నారు. ఈషోలో తాప్సీ, మంచు లక్ష్మి కూడా పాల్గొనడం విశేషం.
Atttend the exclusive live premiere of Southbay. Live YouTube channel. Catch live at the Why Are You Premiere! https://t.co/GD5eK52qz7
— Venkatesh Daggubati (@VenkyMama)On both my screens 🔥 https://t.co/Co43IwnTLT pic.twitter.com/kxeV1pLXeJ
— Rana Daggubati (@RanaDaggubati). and with the on https://t.co/Co43IwnTLT pic.twitter.com/p372Og5hgu
— Rana Daggubati (@RanaDaggubati)