
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా MSR దర్శకత్వంలో శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్పై శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం "ఇందువదన". చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 రిలీజ్ చేయబోతున్నారు.
చాలా కాలం తరువాత వరుణ్ సందేష్ సిల్వర్ స్క్రీన్ కు రీఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా తనకు టచ్ లేని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు యంగ్ హీరో. ఇప్పటికే టీజర్.. ఫస్ట్ లుక్స్ ప్రమోషన్ వీడియోస్ తో వరుణ్ సందేశ్ మెప్పించాడు. ఇక సినిమా సూపర్ హిట్ అవుతుంది అని ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. న్యూ ఇయర్ కు ఇండస్టరీలో తనకు సెకండ్ లైఫ్ వస్తుంది అని నమ్ముతున్నాడు వరుణ్.
ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో "ఇందువదన" ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో వరుణ్ మాట్లాడుతూ..సతీష్ గారు ఫోన్ చేసి నాకు కథ చెప్పారు. నేను బిగ్ స్క్రీన్ మీదకు వచ్చి ఐదు సంవత్సరాలు అయ్యింది.ఇప్పటివరకు పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయలేదు.ఇందులో నా లుక్ డీఫ్రెంట్ గా డిజైన్ చేశారు దర్శకుడు. నరేష్,సంతోష్,గిరిధర్ లు మమ్మల్ని నమ్మి ఈ సినిమా తీయడం జరిగింది.మహేష్ విట్టా, పార్వతీశం లు చాలా బాగా చేశారు. ఇందులో చిలిపి చూపులు సాంగ్ కు శివ శంకర్ మాస్టర్ తో పని చేయడం హ్యాపీ గా ఉన్నా.. తను మన మద్య లేకపోవడం చాలా బాధాకరం. ఈ సినిమాకు ఓటిటి ఆఫర్ వచ్చినా కూడా ఐదు సంవత్సరాలు తర్వాత నేను బిగ్ స్క్రీన్ పై వస్తున్నానని నా కోసం థియేటర్స్ లలో విడుదల చేస్తున్నందుకు ప్రొడ్యూసర్స్ కు చాలా థ్యాక్స్ అన్నారు.
డైరెక్టర్ ఎమ్మెస్సార్ మాట్లాడుతూ.. ఇందులో కామెడీఎమోషన్ ఇలా అన్ని ఫుల్ మీల్స్ ఉంటుంది. నిర్మాతలు బాగా సపోర్ట్ తో ఈ మూవీ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు భాస్కరబట్ల ఒక మంచి సాంగ్ రాశారు.హీరో, హీరోయిన్లు, ఆర్టిస్టులు చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు.హీరో వరుణ్ చాలా బాగా నటించాడు. ఫర్నాజ్ శెట్టి ఒక తెలుగు అమ్మాయి గా అద్భుతంగా చేసింది.. ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వస్తాయి. తక్కువ టైం లో మారేడ్ పల్లి, రంప చోడవరం వంటి చాలా లొకేషన్స్ లలో ఈ సినిమా చేయడం జరిగింది. జనవరి 1 న విడుదల అవుతున్న మా సినిమా లస్ట్ మూవీ కాదు ఫ్యామిలీ అందరూ కలసి చూసే సినిమా అని అన్నారు.
మూవీ ప్రొడ్యూసర్ మాధవి ఆదుర్తి మాట్లాడుతూ..మాకు ఈ స్టోరీ ను సతీష్ గారు చాలా బాగా నెరేట్ చేశారు. కథ మా అందరికీ బాగా నచ్చడంతో ఈ సినిమాను ఎంతో ప్యాషనేట్ తో మేమంతా కలసి ఈ సినిమా తీయడం జరిగింది. ఇండస్ట్రీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉన్నాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో కామెడీ, లవ్, హర్రర్ ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులను ఏంటర్ టైన్మెంట్స్ చేస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ కలసి చూసే చూసే సినిమా ఇది. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ కూడా మా సినిమాను మంచి బ్లెస్సింగ్ ఇస్తారని ఆశిస్తున్నానన్నారు.
Also Read : Allu Arjun Pushpa: వైరల్ అవుతున్న పుష్ప డిలీటెడ్ సీన్, ఉంచి ఉంటే.. థియేటర్లు దద్దరిల్లేవి అంటున్న నెటిజన్లు