Vaishnav Tej: టీవిల్లో ‘కొండపొలం’క్లిక్ అయ్యిందా,లేదా?

By Surya PrakashFirst Published Jan 13, 2022, 6:38 PM IST
Highlights

ఈ సినిమాని రీసెంట్ గా టెలివిజన్ ప్రీమియర్ లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఈ మధ్యనే ‘స్టార్ మా’ వారు మొదటి సారి టెలికాస్ట్ చేయగా అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యింది. 

‘ఉప్పెన’ మూవీతో మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న వైష్ణవ్‌ రెండవ చిత్రం ప్రముఖ దర్శకుడు జాగర్లమూడితో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. కొండపాలెం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్‌ను ‘కొండపొలం’గా ఖారారు చేసి  విడుదల చేసారు. అయితే అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. సినిమా ప్లాఫ్ టాక్ వచ్చింది. ఈ సినిమాని రీసెంట్ గా టెలివిజన్ ప్రీమియర్ లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఈ మధ్యనే ‘స్టార్ మా’ వారు మొదటి సారి టెలికాస్ట్ చేయగా అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యింది. 

 ‘కొండపొలం’ చిత్రాన్ని జనవరి 2న స్టార్ వారు మొదటిసారి టెలీకాస్ట్ చేశారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ‘కొండపొలం’ చిత్రం 12.34 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను రూ.5.5 కోట్లకి స్టార్ మా వారు దక్కించుకున్నారు. అయితే మొదటిసారే ఈ చిత్రం 12కి పైన టి.ఆర్.పి నమోదు చేయడంతో వారు సేఫ్ అవ్వడమే కాకుండా లాభాల బాట కూడా పట్టారని ట్రేడ్ అంటోంది.

కథేంటి? 
గొర్రెలు కాసుకునే కుటుంబంలో పుట్టిన రవి (వైష్ణవ్ తేజ్) ఇంజనీరింగ్ వరకూ చదివి జాబ్ కోసం ప్రయత్నిస్తూ..అన్ని ఇంటర్వూలల్లో ఫెయిలవుతూ ఉంటాడు. ఆత్మ విశ్వాసం లేక,భయంతో విఫలమవుతుంటాడు. ఈ క్రమంలో తన వాళ్ళతో కలిసి కొండపొలానికి గొర్రెలు కాయడానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ అడవిలో రవికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? ఎలాంటి ఆపదలు ఎదురయ్యాయి ? వాటిని అతను ఎలా ఎదిరించి గెలిచాడు ? చివరకు జాబ్ సంపాదించాడు అన్నది కథ.

ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. గడ్డం, మాస్‌లుక్‌లో పంజా వైష్ణవ్‌ ఎంట్రీ ఇచ్చాడు.   అక్టోబరు 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వైష్ణవ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటించింది. ఈ చిత్రాన్ని న‌ల్లమల అటవీ ప్రాంతంలో 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

click me!