తన ఇంట్లోనే ఇద్దరు పద్మ విభూషణులు.. ఉపాసన ఎమోషనల్‌ పోస్ట్..

By Aithagoni RajuFirst Published Jan 27, 2024, 3:28 PM IST
Highlights

చిరంజీవికి భారత అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మెగా కోడలు ఉపాసన స్పందించింది. ఆమె ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. 

మెగా కోడలు ఉపాసన ఓ వైపు మెగా ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్ ని మెయింటేన్‌ చేస్తూనే మరోవైపు తన వ్యాపారాలను చూసుకుంటుంది. అపోలో ఆసుపత్రికి సంబంధించిన ఫౌండేషన్‌, మెడికల్‌ విభాగాన్ని ఉపాసన చూసుకుంటున్నారు. మరోవైపు తన చిన్నారి కూతురు క్లీంకార పెంపకం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మల్టీపుల్‌ వర్క్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. అదే సమయంలో పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది ఉపాసన. 

తాజాగా భావోద్వేగానికి గురయ్యింది. చిరంజీవికి భారత అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మెగా కోడలు ఉపాసన స్పందించింది. ఆమె ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. తన ఇంట్లోనే ఇద్దరికి ఈ అత్యున్నత పురస్కారం రావడం పట్ల ఆమె తన సంతోషాన్ని వ్యక్తంచేసింది. ఇండియా జనాభ 140కోట్లు. ఇప్పటి వరకు పద్మ విభూషణ్‌ అవార్డు కేవలం 336 మందికి మాత్రమే వచ్చింది. అందులోనూ ఇద్దరు తమ ఇంట్లో ఉండటంతో ఉపాసన ఆనందానికి అవదుల్లేవు. 

Latest Videos

దీంతో ఆమె సోషల్‌ మీడియా ద్వారా తన హ్యాపీనెస్‌ని పంచుకుంది. కేవలం సినిమా, దాతృత్వంలోనే కాకుండా జీవితంలో నాన్నగా, మామలా, తాతగా మాకు స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు అభినందనలు. ఇప్పుడు మా కుటుంబంలో రెండు పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీతలు మా తాత డాక్టర్ ప్రతాప్‌ సీ రెండ్డి, మామయ్య డాక్టర్‌ చిరంజీవి కొణిదెలను కలిగి ఉన్నందుకు గౌరవంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను` అని పేర్కొంది ఉపాసన. 

చిరంజీవికి ఇప్పటికే పద్మ శ్రీ, పద్మ భూషణ్‌ పురస్కారాలు వరించాయి. ఇప్పుడు రెండో అత్యున్నత పురస్కారం రావడం విశేషం. ఇక మిగిలింది భారతరత్న మాత్రమే. భవిష్యత్‌లో అది కూడా వరించినా ఆశ్చర్యం లేదు. ఇక చిరంజీవి ఇప్పటి వరకు 155సినిమాల్లో నటించారు. మూడు నంది అవార్డులు అందుకున్నారు. పలు ఫిల్మ్ ఫేర్‌ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటు చేయించారు. బ్లడ్‌ బ్యాంకులు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 11లక్షల యూనిట్లని పంపిణి చేశారు. అలాగే సినీ కార్మికులకు తనవంతు సహాయం అందిస్తూనే ఉన్నారు. 

ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. చిరంజీవి ఇంకా పాల్గొనాల్సి ఉంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో జాయిన్‌ అవుతారని సమాచారం. 

click me!