Dhootha : ఓటీటీలో దుమ్ములేపుతున్న ‘ధూత’.. నాగచైతన్య రియాక్షన్ ఇదే?

By Nuthi SrikanthFirst Published Dec 24, 2023, 12:51 PM IST
Highlights

నాగచైతన్య లేటెస్ట్ వెబ్ సిరీస్ ధూత Dhootha  ఓటీటీలో దుమ్ములేపుతోంది. టాప్ 1లో ట్రెండింగ్ అవుతోంది. దీనిపై తాజాగా చైతూ కూడా స్పందించారు. సిరీస్ పై క్రేజీ కామెంట్ ఇచ్చారు. 

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య Naga Chaitanya ప్రస్తుతం కెరీర్ లో ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా ఫ్లాప్స్ పడుతుండటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై శ్రద్ధ వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తను నటించిన వెబ్ సిరీస్ ‘ధూత’ (Dhootha)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ థ్రిల్లర్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే చైతూ నటించిన ఈ సిరీస్ కు ఓటీటీలో మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. 

ఇక తాజాగా ఆర్మాక్స్ స్ట్రీమ్ ట్రాక్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ధూత సిరీస్ టాప్ 1లో ప్రసారమవుతోంది. డిసెంబర్ 15 నుంచి21 వరకు ఈ సిరీస్ ను ఎక్కువ మంది ఓటీటీలో వీక్షించారు. నాగచైతన్య సిరీస్ కు ఇంత మంచి రెస్పాన్స్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా చైతూ కూడా ఈ రెస్పాన్స్ పై స్పందించారు. క్రేజీగా కామెంట్ కూడా ఇచ్చారు. 

Latest Videos

ధూత సిరీస్ పోస్టర్ తో పాటు, ఆర్మాక్స్ విడుదల చేసిన రిపోర్టును తన ఎక్స్ (ట్విటర్) లో పోస్టు చేశారు. సిరీస్  నెంబర్ 1లో ఉందని చెప్పారు. Rocking It అంటూ తన ఫీలింగ్ ను వ్యక్తం చేశారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 24 రోజులు అవుతున్నా మంచి వ్యూయర్ షిప్ దక్కుతోంది. చివరిగా చైతూ ‘కస్టడీ’తో ఆశించిన రిజల్ట్ ను అందుకోలేకపోయారు. ‘ధూత’తో కాస్తా ఉపశమనం లభించింది. 

ఇక నెక్ట్స్ ‘కార్తీకేయ 2’ డైరెక్టర్ చందూ మొండేటితో కలిసి వర్క్ చేస్తున్నారు. జాలరుగా కనిపించబోతున్నారు. శ్రీకాకుళం ప్రాంత వాసిగా చైతూ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తండేల్ (Thandel) అంటూ టైటిల్ కూడా ప్రకటించారు. చిత్రంలో చైతూకు జోడీగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి Sai Pallavi నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ధూత సిరీస్ లో నాగ చైతన్యతో పాటు ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, పశుపతి, రవీంద్ర విజయ్, తరుణ్ భాస్కర్, రోహిణి, అనీష్ కురువిల్లా, తనికెళ్ల భరణి, ఈశ్వరి రావు, రాజా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. 

click me!