విషాదం: కరోనాతో ప్రముఖ టీవీ నటి కన్నుమూత

By Aithagoni RajuFirst Published Nov 22, 2021, 7:48 PM IST
Highlights

హిందీ టీవీ నటి మాధవి గోగటే(53) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో హిందీ టీవీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. 

హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హిందీ టీవీ నటి మాధవి గోగటే(53)(Madhavi Gogate) కన్నుమూశారు. ఆమె కరోనా నుంచి కోలుకున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. మాధవి గోగటేకి ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి ఆమె కోలుకుంటున్నారు. కానీ ఇతర అనారోగ్య కారణాలతో ఆమె ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 

మాధవి గోగతే.. రూపాలి గంగూలి రూపొందించిన `అనుపమా` అనే షోతో మాధవి గోగటే పాపులర్‌ అయ్యారు. ఇందులో ఆమె అనుపమాకి తల్లి పాత్రలో నటించారు. ఈ షో బాగా పాపులర్‌ కావడంతో మాధవికి మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఆమె హఠాన్మరణంతో హింటీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యింది. మాధవి గోగటే మరణంపై రూపాలి గంగూలి స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. చాలా కోల్పోయామని తెలిపారు. 

మాధవి ఫ్రెండ్, నటి నీలు కోహ్లి స్పందిస్తూ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకున్నారు. తన ప్రియమైన స్నేహితురాలు మాధవి గోగటే ఇకలేరు. ఆమె ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. `హార్ట్ బ్రేక్‌ అయిపోయింది. చాలా చిన్న వయసులోనే ఆమె మమ్మల్ని విడిచివెళ్లిపోయారు. మీ సందేశానికి నేను రిప్లై ఇవ్వనందుకు ఇప్పుడు రియలైజ్‌ అవుతున్నా. చాలామిస్‌ అవుతున్నా` అని చెప్పారు. వీరితోపాటు టీవీ సెలబ్రిటీలు మేహుల్‌ నిసార్, షీలా శర్మ, డెల్నాజ్‌ ఇరానీ, హేషా రుఘని, రషద్‌ రానా, ఆశిష్‌ మెహరోత్రా వంటి ప్రముఖులు సంతాపం తెలిపారు.

టీవీ నటి మాధవి `అనుపమా` షోతోపాటు పలు టీవీ సీరియల్స్, సినిమాల్లనూ నటించారు. `ఘంచక్కర్‌` మరాఠి సినిమాలోనూ మంచి పాత్ర పోషించారు. వీటితోపాటు `భ్రమచా బోపాలా`, `తేలా మాధవ్‌ కునికడే` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఆమె `తుజా మజా జమ్టే` సీరియల్ తో నటిగా ఎంట్రీ ఇచ్చారు. `కోయి అప్నా సా`, `హైసా కభీ సోచా నా థా`, `కహిన్‌ తోహ హోగా` టీవీ సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు.

also read: ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. కరోనా పాజిటివ్, ఆందోళనలో అభిమానులు
 

click me!