Intinti Gruhalakshmi: తులసి,నందుని చూసి షాకైన దీపక్.. విక్రమ్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న రాజ్యలక్ష్మి?

By Navya ReddyFirst Published Mar 18, 2023, 9:16 AM IST
Highlights

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 18 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో వాసుదేవ్ అతని భార్య ఎక్కడికి వెళ్లావు కనిపించలేదు అని అడగగా సోమవారం కదా అన్నయ్య గుడికి వెళుతున్నాను అనడంతో సోమవారం అని వెళ్ళావా లేక మ్యారేజ్ డే అని వెళ్ళావా, అయినా పెళ్లి రోజు భర్త పక్కన లేకుండా గుడికి వెళ్లడం ఏంటమ్మా అని అంటాడు. అయినా మీరు ఇలా పంపించారు అనగా ఇంతలో లాస్య అడిగింది కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల రాను అని చెప్పారు అనడంతో బిజీగా ఉండటం ఏంటి పెళ్లి రోజు భార్య పక్కన లేని మగాడు అసలు పెళ్లి చేసుకోవడానికి అనర్హుడు అని అంటాడు వాసుదేవ్. అప్పుడు నందు ని పిలవగా ఏమైందిరా వాసుదేవ్ అనగా అర్జెంటుగా నా చెల్లెలికి విడాకులు ఇచ్చేయ్ అనడంతో అందరూ షాక్ అవుతారు. శుభమా అని పెళ్లి రోజు నాకు ఇలాంటి మాటలు ఏంటండీ అని అనడంతో మరి వాడు చేసింది ఏంటి తులసి పిలిచినప్పుడు గుడికి వెళ్లకుండా వాడికి అంతకుమించిన పనులు ఏమున్నాయి తులసి ఎంత హర్ట్ అయ్యి ఉంటుంది అని అంటాడు వాసుదేవ్.

అప్పుడు లాస్య గంట గంటకు టెన్షన్ పెడుతున్నాడు ఆటాడుకుంటున్నాడు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసిని ఇప్పటినుంచైనా జాగ్రత్తగా చూసుకో అని అనడంతో సరే అని వాసుదేవ్ కి మాట ఇస్తాడు నందు. చూడమ్మా తులసి వీడు నిన్ను సరిగా చూసుకోకపోతే నాకు ఒక ఫోన్ కాల్ కొట్టు వెంటనే బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటాను అనడంతో నందు షాక్ అవుతాడు. అప్పుడు వాసుదేవ్ అతని భార్య తులసి, నందు వాళ్లకు కొత్త బట్టలు ఇచ్చి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతారు. సాయంత్రం పార్టీ ఉంది మీరు ఈ బట్టలు కట్టుకోవాలి లాస్య ఆ పార్టీలో వీళ్ళు బట్టలు వేసుకుని ఇలా చేయాల్సింది నువ్వే అని అంటుంది వాసుదేవ్ భార్య. అప్పుడు పనిమనిషి రాములమ్మ తులసమ్మ నందు బాబు పక్కపక్కన ఉంటేనే మీకు కడుపు మంటగా ఉందే అలాంటప్పుడు శాశ్వతంగా తీసుకున్నప్పుడు ఆ అమ్మకు ఎంత కడుపు రగిలిపోవాలి అని అంటుంది.

ఇంతలో దీపక్ అక్కడికి రావడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు వాసుదేవ్, దీపక్ ని మేము వచ్చామని చూడ్డానికి వచ్చావా లేక మీ అక్క బావ పెళ్లి రోజు అని విషెస్ చేయడానికి వచ్చావా? అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు నందు సరదాగా జోకులు వేయడంతో దీపక్ కూడా ఏదో జరుగుతుంది తర్వాత మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. మరోవైపు దివ్య దగ్గరికి ఒక ఆవిడ వచ్చి మీరు 8,000 అవుతుందని చెప్పారు ఇక్కడే వెళ్లి 25000 రాశారు అనడంతో ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే వస్తాను అని దివ్య అక్కడి నుంచి వెళ్తుంది. మరొకవైపు సంజయ్ నర్సుతో చండాలంగా బిహేవ్ చేస్తూ ముద్దు పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు నర్స్ కి మాయమాటలు చెప్పి రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు.

నర్సికి మాయమాటలు చెప్పి తొందరగా పెళ్లి చేసుకుంటాను అని చెబుతాడు. ఆ తర్వాత దివ్య అక్కడికి రావడంతో నీకు బుద్ధిగా సెన్స్ లేదా పిలవకుండా అడగకుండా వచ్చే డిస్టర్బ్ చేస్తున్నావు అనడంతో నా పేషెంట్ కి మీరు ఎందుకు రాయించారు అని అంటుంది దివ్య. మీకు మాత్రమే పేషెంట్ కాదు మా పేషెంట్ కూడా తనకేం టెస్టులు చేయాలో మేము డిసైడ్ చేస్తాము అని అంటాడు. ఈ బిల్ విషయంలో నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు నీ పని నువ్వు చూసుకో అనడంతో ఈ విషయాన్ని నేను ఎండి దగ్గరికి తీసుకొని వెళ్తాను అని దివ్య అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరొకవైపు దీపక్ వాళ్ళ స్వార్థం కోసం నిన్ను వాడుకుంటున్నారు అక్క అని అంటాడు. నేనేం చిన్నపిల్లలని కాదు దీపక్. ఎవరి మనసులో ఏది ఉంది అర్థం చేసుకోలేకపోవడానికి అని అంటుంది తులసి.

విడాకులు ఇచ్చిన బావగారితో ఎందుకు పెళ్లిరోజు జరుపుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు దీపక్. ఎంత కాదనుకున్నా ఆయన నాతో 25 ఏళ్లు కాపురం చేశారు. అలా అని అతని మీద నాకు ప్రేమ లేదు ఫీలింగ్ లేదు అని అంటుంది తులసి. అయినా కేవలం నా పిల్లలకు తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవిస్తున్నాను అని అంటుంది తులసి. మరి భార్యగా నటించిడం అనగా తప్పే రా అనగా అలాగే కేఫ్ విషయంలో నువ్వు సపోర్ట్ చేయడం నాకేం నచ్చడం లేదు అక్క అని అంటాడు దీపక్. నేను ఆయనకు దూరంగా ఉంటే పిల్లలు కూడా ఆయనకు దూరంగా ఉంటున్నారు తండ్రి పిల్లలను దూరం చేయడం నాకు ఇష్టం లేదు అని అంటుంది తులసి. నీ ఫీలింగ్స్ ని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు కదా అక్క అనగా అది నాకు అనవసరం అని అంటుంది తులసి.

మరోవైపు నందు తులసి గురించి ఆలోచిస్తూ తులసి నాకు చేస్తున్న సహాయం చాలా గొప్పది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. నా స్వార్థం కోసం తులసిని ఉపయోగించుకుంటున్నాను అని బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసి కోసం ఏదో ఒకటి ఇవ్వాలి అని నందు జువెలరీ షాప్ అతనికి ఫోన్ చేస్తారు. మరొకవైపు రాజ్యలక్ష్మి విక్రమ్ ని తన వైపు తిప్పుకోవడానికి దొంగ పూజలు చేస్తూ ఉంటుంది. విక్రమ్ అక్కడికి రావడంతో బసవయ్య ప్రసూనాంబ కలసి రాజ్యలక్ష్మి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటారు.

అప్పుడు కావాలనే విక్రమ్ కి వినిపించే విధంగా ఎందుకు స్వామి నేను ఏం తప్పు చేశాను నా బిడ్డను నాకు దూరం చేస్తున్నావు అని దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది రాజ్యలక్ష్మి. నా బిడ్డ నా దగ్గరికి వచ్చే వరకు నేను ఎవరి మాట వినను అంటూ పూజ చేస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు నటిస్తుంది రాజ్యలక్ష్మి. ఎందుకమ్మా ఇదంతా చేస్తున్నావు అనడంతో విక్రమ్ పై దొంగ ప్రేమలు కురిపిస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు రాజ్యలక్ష్మి, బసవయ్య, ప్రసూనాంబ అందరూ కలిసి వీటిని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంటారు.

click me!