పవన్ ఉన్నారని పాటలు వద్దు..తేల్చిన త్రివిక్రమ్

By Surya PrakashFirst Published Jul 11, 2021, 12:13 PM IST
Highlights

ఈ సినిమాకు  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  స్క్రీన్ ప్లే,మాటలు ఇస్తున్నారు. స్క్రిప్టు వర్క్ చేసిన త్రివికమ్ నేరషన్ ని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ కట్ లో కేవలం మూడు పాటలు మాత్రమే ఉండేలా చూడమని చెప్పారట. 


మలయాళ హిట్ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ మల్టీస్టారర్ లో పవన్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారిగా నిత్యామీనన్ హీరోయిన్ గా నటించనుంది. సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇంటెన్స్ డ్రామాగా నడుస్తుంది. ఈ సినిమాకు  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే,మాటలు ఇస్తున్నారు. స్క్రిప్టు వర్క్ చేసిన త్రివికమ్ నేరషన్ ని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ కట్ లో కేవలం మూడు పాటలు మాత్రమే ఉండేలా చూడమని చెప్పారట. పవన్ కళ్యాణ్ ఉన్నారని పాటలుకు ప్రయారిటీ ఇవ్వద్దని, అవి కథనాన్ని దెబ్బ తీస్తాయని ఖచ్చితంగా చెప్పారట.
 
ఇక కరోనా తో ఆగిన ఈ చిత్రం షూటింగ్  ఈ నెల 12న ప్రారంభం కానుంది.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం మేర షూటింగ్ ను కంప్లీట్ చేసింది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు.   నిత్యామీనన్ కూడా సినిమా సెట్లో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ షెడ్యూల్ లోనే పవన్ పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారట. పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్ కు సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాని మొదట ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు కావడంతో ఈ చిత్రం వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈ సినిమాను నిలబెట్టాలని చూస్తున్నారట దర్శకనిర్మాతలు. కాగా అందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి మేకర్స్ ఏ విధంగా దీనిపై స్పందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

click me!