- సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారం
- అందరికంటే ఎక్కువ ప్రభావం త్రిషపైనే
- రెండు వారాల తర్వాత కోలుకున్న త్రిష
సుచి లీక్స్ వ్యవహారంతో గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు ఎంతగా కుదేలయ్యారో తెలిసిందే. ఇప్పుడిప్పుడే సుచీలీక్స్ బాధితులు కోలుకుంటున్నారు. అందులో త్రిష కూడా ఉందనే విషయం తెలిసిందే. ఈ చెన్నై చిన్నది సుచీలీక్స్ లీకేజీల తర్వాత మాత్రం సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైంది. దాదాపు 2 వారాల పాటు ఎలాంటి అప్ డేట్స్, పిక్స్ పెట్టకుండా పూర్తిగా ఫ్యాన్స్ కు దూరమైపోయింది. ఎట్టకేలకు ఈ చెన్నై బ్యూటీ ట్విట్టర్ లో మళ్లీ హంగామా షురూ చేసింది. నిన్నటికి నిన్న తన గ్లామరస్ లుక్ ను పోస్ట్ చేసిన ఈ భామ.. తాజాగా మలేషియాలోని తన ఫ్రెండ్స్ తో దిగిన మరో ఫొటోను కూడా షేర్ చేసింది.
నిజానికి ఇంకొన్నాళ్ల పాటు ఈ సోషల్ మీడియా వ్యవహారాలకు దూరంగా ఉండాలనుకుంది త్రిష. కాకపోతే.. ఆమె ఆరోగ్యం బాగాలేదంటూ ఒక్కసారిగా పుకార్లు గుప్పుమన్నాయి. హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ ప్రచారం జరిగింది. అలాంటిదేం లేదంటూ త్రిష తల్లి వివరణ ఇచ్చినప్పటికీ రూమర్లు మాత్రం ఆగలేదు. దీంతో మరోసారి సోషల్ మీడియాలోకి రాక తప్పలేదు త్రిషకు.
ప్రస్తుతం అరవింద్ స్వామితో ఓ సినిమా చేస్తున్న త్రిష. తెలుగు-తమిళ భాషల్లో త్వరలోనే ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో కూడా నటించేందుకు రెడీ అవుతోంది. రేపోమాపో మలేషియా నుంచి చెన్నైకి రానుంది.