పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పుష్పగుచ్చాలు పంపించారు. నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సింగర్ స్మిత తదితరులు ఈ చిత్రాన్ని స్పెషల్గా వీక్షించారు.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన `రిపబ్లిక్` చిత్రం అక్టోబర్ 1న విడుదలై మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రాన్ని, చిత్ర యూనిట్ని అభినందిస్తూ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పుష్పగుచ్చాలు పంపించారు. నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా సినిమాపై ప్రశంసలు కురిపించారు.
తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సింగర్ స్మిత తదితరులు ఈ చిత్రాన్ని స్పెషల్గా వీక్షించారు. అనంతరం వారు సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా వారికి బాగా నచ్చిందని, ఇంత మంచి సందేశాత్మక చిత్రాన్ని తీసిన టీమ్ని అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు దేవా కట్టాతో దిగిన ఫోటో వైరల్ అవుతుంది.
సాయిధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకత్వం వహించగా, భగవాన్, పుల్లారావు నిర్మించారు. ఇందులో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. కొల్లేరు సరస్సు వెనకాల జరిగిన రాజకీయ కుట్రల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.