యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్ ట్వీట్‌.. త్వరలో కలుద్దామంటూ.. ఆనందంలో ఫ్యాన్స్

Published : Oct 03, 2021, 06:04 PM ISTUpdated : Oct 03, 2021, 06:21 PM IST
యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్ ట్వీట్‌.. త్వరలో కలుద్దామంటూ.. ఆనందంలో ఫ్యాన్స్

సారాంశం

హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు. కోమాలోకి వెళ్లారు. ఇంకా కోలుకోలేదని, కళ్లు తెరవలేని స్థితిలో ఉన్నారని ఇటీవల `రిపబ్లిక్‌` ఫంక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మరోవైపు శనివారం `కొండపొలం` ఈవెంట్‌లో వైష్ణవ్‌ తేజ్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్ట్ అవుతారని తెలిపారు. 

సాయిధరమ్‌ తేజ్‌ గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వినాయక చవితి రోజు ఆయన బైక్‌ పై వెళ్తూ రోడ్డు యాక్సిడెంట్‌కి గురయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాయితేజ్‌ అప్పటి నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు. కోమాలోకి వెళ్లారు. ఇంకా కోలుకోలేదని, కళ్లు తెరవలేని స్థితిలో ఉన్నారని ఇటీవల `రిపబ్లిక్‌` ఫంక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మరోవైపు శనివారం `కొండపొలం` ఈవెంట్‌లో వైష్ణవ్‌ తేజ్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్ట్ అవుతారని తెలిపారు. 

ఈ నేపథ్యంలో సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదం తర్వాత ఫస్ట్ టైమ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రైట్‌ హ్యాండ్‌ థంబ్‌ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు. `నాపై, నా చిత్రం `రిపబ్లిక్‌`పై మీ ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు అనే చిన్న పదం రూపంలో తెలియజేస్తున్నా. త్వరలోనే కలుద్దాం` అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తో మెగా అభిమానుల్లో సంతోషాలు స్టార్ట్ అయ్యాయి. 

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన `రిపబ్లిక్‌` చిత్రం అక్టోబర్‌ 1న విడుదలైన విషయం తెలిసిందే. ఇది మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌ కథానాయికగా నటించగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

మహేష్ బాబు సంస్కారానికి ఫిదా అయిన హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ అంతలా ఏం చేశారు?
Shruti Haasan: పెళ్లి చేసుకుంటే అలాగే చేసుకుంటా, మ్యారేజ్ పై తన డ్రీమ్ రివీల్ చేసిన శ్రుతి హాసన్