చిరు, మహేష్ కోటి...ఎన్టీఆర్ 50లక్షలు...వరద బాధితుల కోసం రంగంలోకి దిగిన టాలీవుడ్ స్టార్స్

By team teluguFirst Published Oct 20, 2020, 2:43 PM IST
Highlights

వరదల బారినపడ్డ నిస్సహాయులను ఆదుకొనేందుకు టాలీవుడ్ స్టార్స్ మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. వరద బాధితుల సహాయార్ధం స్టార్ హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన ప్రముఖులు తెలంగాణా సీఎం సహాయ నిధికి తమ వంతు ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సాయం ప్రకటించగా, మహేష్ మరో కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరద బాధితుల సహాయార్ధం రూ.  50 లక్షల సాయం ప్రకటించారు.

2020 ప్రజలకు కఠిన పరిస్థులను పరిచయం చేసింది. కరోనా వైరస్ కారణంగా జనజీవనం అస్థవ్యస్తం కావడం జరిగింది. ఇది చాలదన్నట్లు హైదరాబాద్ ని ముంచెత్తిన వరదలు మరింత ఇక్కట్లు పాలు చేశాయి. ఎన్నడూ లేని విధంగా నమోదైన వర్షపాతం వలన మూసీ నదితో పాటు అనేక చెరువులు పొంగి నివాస స్థలాలను ముంచెత్తాయి. రోడ్లు వాగులై పారంగా, అనేక మంది ప్రవాహానికి కొట్టుకుపోయారు. వాహనాలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్తు, ఆహారం, నీరు లేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Contributing ₹1 crore towards the CM relief fund of Telangana. I urge all of you to come forward and donate towards the cause. Let's stand by our people during these difficult times.🙏🏻

— Mahesh Babu (@urstrulyMahesh)

ఈ నేపథ్యంలో వరదల బారినపడ్డ నిస్సహాయులను ఆదుకొనేందుకు టాలీవుడ్ స్టార్స్ మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. వరద బాధితుల సహాయార్ధం స్టార్ హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన ప్రముఖులు తెలంగాణా సీఎం సహాయ నిధికి తమ వంతు ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సాయం ప్రకటించగా, మహేష్ మరో కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి ప్రకటించారు. 

The unprecedented rains in Hyd have caused massive devastation,loss of lives & extreme hardship to thousands. My heart goes out to those affected by nature's fury.I'm humbly donating Rs.1Cr to CM Relief Fund.Also appeal 2 all who can to come frward & help the needy pic.twitter.com/ARBeV9JShy

— Chiranjeevi Konidela (@KChiruTweets)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరద బాధితుల సహాయార్ధం రూ.  50 లక్షల సాయం ప్రకటించారు. కింగ్ నాగార్జున, బాల కృష్ణ సైతం చెరో రూ. 50 లక్షల రుపాయిలు సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించడం జరిగింది. హీరో విజయ్ దేవరకొండ మరో రూ. 10లక్షల సాయం చేస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

Many lives in Hyderabad have been devastated by the rains and floods. I am contributing 50 Lakh Rupees to the Telangana CM Relief Fund towards the rehabilitation of our city. Let us all chip in and rebuild our Hyderabad

— Jr NTR (@tarak9999)

దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి మరియు హరీష్ శంకర్ తలో రూ. 5లక్షల చొప్పున వరద బాధితుల సహాయార్ధం...తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మిగిలిన సినీ ప్రముఖులు సైతం సాయానికి ముందుకు వస్తున్నారు. 
 

We came together for Kerala
We came together for Chennai
We came together for the Army
We came together in huge numbers for each other during Corona
This time our city and our people need a helping hand.. pic.twitter.com/pahnuNTXfi

— Vijay Deverakonda (@TheDeverakonda)
click me!