జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి సహా సీఎంను కలిసేది వీళ్లే!

By Satish ReddyFirst Published Jun 9, 2020, 11:03 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కోసం పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో చర్చించేందుకు మంగళవారం వెళుతున్నారు. అయితే కరోనా ప్రభావం కారణంగా కేవలం ఏడుగురికి మాత్రమే రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ సీఎంఓ సూచించింది.

కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో దాదాపు 75 రోజులుగా సినిమాలు, సీరియల్స్‌క సంబంధించిన అన్ని కార్యక్రమాలు స్తంబించిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు ఎలాంటి ఉపాది లేక ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్‌ సడలింపుల్లో భాగంగా అన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తుండటంతో సినీ ప్రముఖులు కూడా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ మేరకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలతో షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కోసం పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో చర్చించేందుకు మంగళవారం వెళుతున్నారు. అయితే కరోనా ప్రభావం కారణంగా కేవలం ఏడుగురికి మాత్రమే రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ సీఎంఓ సూచించింది.

దీంతో చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు, దిల్‌ రాజు, సీ కళ్యాణ్ , దామోదర ప్రసాద్ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చర్చల్లో భాగంగా సినిమా షూటింగ్‌లకు సింగల్‌ విండో అనుమతులు, సినిమా హాళ్లు తెరిచే అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు.

click me!