టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత

By Prashanth MFirst Published Feb 18, 2019, 8:19 PM IST
Highlights

టాలీవుడ్ సీనియర్ నటుడు డి.యస్.దీక్షితులు మరణించినట్లు తెలుస్తోంది. 60 ఏళ్ల దీక్షితులు టాలీవుడ్ లో ఎక్కువగా పూజారి పాత్రల్లో కనిపించారు. గుంటూరు జిల్లా రేపల్లె లో జన్మించిన ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులు అందుకున్నారు.  సంస్కత, తెలుగు భాషలలో అలాగే రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు కూడా పొందారు. 

టాలీవుడ్ సీనియర్ నటుడు డి.యస్.దీక్షితులు కన్నుమూశారు. షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారని సమాచారం. 60 ఏళ్ల దీక్షితులు టాలీవుడ్ లో ఎక్కువగా పూజారి పాత్రల్లో కనిపించారు. గుంటూరు జిల్లా రేపల్లె లో జన్మించిన ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులు అందుకున్నారు.  

సంస్కత, తెలుగు భాషలలో అలాగే రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు కూడా పొందారు. హైదరాబాద్ లోని నాచారం రామకృష్ణ సినీ స్టూడియోలో ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న సిరిసిరి మువ్వ సీరియల్ షూటింగులో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా నిలుచున్న చోటే కుప్పకూలినట్లు సమాచారం. 

అక్కడ సీరియల్ యూనిట్ సభ్యులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ మార్గం మధ్యలోనే దీక్షితులు తుది శ్వాసను విడిచినట్లు వైద్యులు నిర్దారించారు. మురారి సినిమాలో ఆయన చేసిన పూజారి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అలాగే అతడు సినిమాలో కూడా ఆయన నటించిన తీరుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. 

ఆగమనం సీరియల్ లో నటనకు నంది అవార్డు దక్కింది. రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా పని చేసిన దీక్షితులు రంగస్థల దర్శకత్వం వైపు ఎక్కువగా అడుగులు వేశారు. ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం,  ఎల్లమ్మ, మురారి, అతడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. 

click me!
Last Updated Feb 18, 2019, 8:50 PM IST
click me!