ప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న చిరంజీవి.. అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం..

Published : Jun 28, 2022, 07:04 PM IST
ప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న చిరంజీవి.. అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం..

సారాంశం

ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి చిరంజీవి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. 

మెగాస్టార్‌ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి చిరంజీవి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌` పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. దీనికి చిరంజీవిని ఆహ్వానించడం విశేషం. 

అల్లూరి సీతారామరాజు 125వజయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జులై 4న నిర్వహించబోతున్నారు. దీనికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేయనున్నారు. పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని చిరంజీవికి పంపిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. 

అల్లూరి సీతారామరాజు ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, కర్నాటకలకు బాగా తెలుసు. అక్కడ ఆయన ఉద్యమాలను  నిర్వహించారు. ఇక్కడి ప్రజలంతా అల్లూరినీ `మన్యం వీరుడి`గా పిలుచుకుంటారు. `అజాదీ కా అమృత్‌ మహోత్సవం`లో భాగంగా దేశం కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించబోతున్నట్టు తెలిపారు. భీమవరంలోని ఏఎస్‌ఆర్‌ నగర్‌లో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అల్లూరి 125వ జయంతి సందర్బంగా ఏడాది పాటు వేడుకలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని సక్సెస్‌ చేయాలని చిరంజీవిని మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌