చోటే మియా బడే మియా... ఆనందంలో తేలియాడుతున్న నాని 

By Sambi ReddyFirst Published Jun 28, 2022, 4:25 PM IST
Highlights


హీరో నాని ఆనందంలో తేలియాడుతున్నాడు. ఆయన లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ని కలిశారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. దీనితో చోటే మియా బడే మియా అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

ప్రభాస్, ప్రశాంత్ నీల్, దుల్కర్ సల్మాన్, రాఘవేంద్రరావు, నాని, అమితాబ్ ఒక్కచోట చేరారు. వీరందరూ ఓ చోటు చేరడానికి కారణం ఉంది. నిర్మాత అశ్వినీ దత్ కొత్త ఆఫీస్ ప్రారంభించారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వీరందరినీ ఆహ్వానించడం జరిగింది. ప్రభాస్ ప్రాజెక్టు కే చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు. ఇక ప్రాజెక్ట్ కే లో అమితాబ్ కీలక రోల్ చేస్తున్నారు. దీనితో వీరిని ప్రత్యేకంగా పిలిచారు. అలాగే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక ఈ ఈవెంట్ కి హీరో నానికి కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలో నాని అమితాబ్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన నాని ఆనందం వ్యక్తం చేశారు. ఇది సాకారం అయ్యింది. చోటే మియా బడే మియా అంటూ కామెంట్ చేశారు. నాని అమితాబ్ తో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

కాగా నాని లేటెస్ట్ రిలీజ్ అంటే సుందరానికీ ఆయనకు షాక్ ఇచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అంటే సుందరానికీ రూ. 20 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. దీంతో ఈ చిత్రం పదికోట్ల వరకు నష్టాలు మిగిల్చింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కించారు. నజ్రియా నానికి జంటగా నటించారు. 

అంటే సుందరానికీ ఫెయిల్యూర్ నేపథ్యంలో నెక్స్ట్ దసరా చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో దసరా తెరకెక్కుతుంది. లుంగీ ధరించి గడ్డంతో నాని డీగ్లామర్ లుక్ ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.దసరా కానుగా ఈ మూవీ విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

click me!