బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్కి, భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, ఆస్కార్ విన్నర్ భాను అథైయాలకు ఆస్కార్ వేడుక ఘన నివాళ్లర్పించింది.
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్కి, భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, ఆస్కార్ విన్నర్ భాను అథైయాలకు ఆస్కార్ వేడుక ఘన నివాళ్లర్పించింది. మెమోరియం సెగ్మెంట్లో వీరిని గుర్తు చేసుకున్నారు. అకాడమీ మొత్తం నివాళిగా సంతాపం తెలియజేశారు. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అక్కడి ఆడియెన్స్ ని కనువిందు చేశాడు. ఆయన `లైఫ్ ఆఫ్ పై`, `జురాసిక్ వరల్డ్`, `ఇన్ఫెర్నో` వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిరుదు ఏప్రిల్ 29న కాన్సర్తో కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి ఇండియన్గా కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథైయా నిలిచారు. 1982లో వచ్చిన `గాంధీ` చిత్రానికి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. ఆ సినిమాకిగానూ ఆమెకి ఆస్కార్ వరించింది. ఆమె కూడా నిరుడు అక్టోబర్ 15న కన్నుమూశారు. ఆమె అనేక హిందీ, బెంగాలీ, హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. ఈ 93వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో ఆమెని ప్రత్యేకంగా గుర్తు చేసుకుని నివాళ్లర్పించారు. వీరితోపాటు ఇటీవల కాలంలో చనిపోయిన `జేమ్స్ బాండ్` నటుడు సియాన్ కెన్నరి, హాలీవుడ్ నటుడు క్రిస్టోఫర్ ప్లమ్మర్, `బ్లాక్ పాంథర్` నటుడు చడ్విక్ బోసెమన్లకు కూడా ఆస్కార్ ఘన నివాళి అర్పించింది.