తారకరత్నని హైదరాబాద్‌కి తరలింపుకు సన్నాహాలు.. అత్యంత విషమంగానే ఆరోగ్యం..

Published : Feb 18, 2023, 09:28 PM IST
తారకరత్నని హైదరాబాద్‌కి తరలింపుకు సన్నాహాలు.. అత్యంత విషమంగానే ఆరోగ్యం..

సారాంశం

నటుడు తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉంది. విదేశీ వైద్యులు సైతం ఆయన్ని ట్రీట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం బెంగుళురులో చికిత్స పొందుతున్న ఆయన్ని హైదరాబాద్‌కి తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. 

నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన గత 22 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో విషమంగానే తారకరత్న ఆరోగ్యం ఉందన్నారు. ఆ తర్వాత కాస్త నిలకడగా ఉందని, కొంత మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్యం విషమించిందని వైద్యులు తెలిపారు. దీంతో శనివారం మధ్యాహ్నం బాలకృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరుకి చేరుకున్నారు. 

ఇదిలా ఉంటే తారకరత్నని హైదరాబాద్‌కి తరలించే అవకావం ఉందట. ప్రస్తుతం దీనికి సంబంధించి వైద్యులు, కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయట. తారకరత్నని హైదరాబాద్‌ కి తరలించేందుకు స్థానిక పోలీసులు కాన్వాయ్‌ని కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ సైతం ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన శనివారం సాయంత్రం బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నని పరామర్శించారు. అనంతరం వెళ్తూ మీడియాతో స్పందించారు. ఆరోగ్యం ఇంకా అలానే ఉందని, హైదరాబాద్‌కి తరలించే విషయంపై చర్చలు జరుపుతున్నారని తెలిపారు. 

గురువారం తారకరత్నకి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేశారు వైద్యులు. రిపోర్ట్ లను బట్టి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. మెదడుకు సంబంధించి వైద్య సేవల కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడు శనివారం అనూహ్యంగా తారకరత్న ఆరోగ్యం క్షిణించిందని, అత్యంత విషమంగా మారిందని వైద్యులు తెలియజేయడం గమనార్హం. గత నెల 27న నారాలోకేష్‌ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే స్థానంగా కుప్పం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వ్యైద్యం కోసం ఆయన్ని నెక్ట్స్ డే బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తరలించిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం విదేశాల నుంచి వైద్యులను పిలిపించి మరీ చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగపడటం లేదని తెలుస్తుంది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే